బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించింది మొదలు సోము వీర్రాజు టీడీపీని ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
వివిధ అంశాలను ప్రస్తావిస్తూ, ఆయన టీడీపీ పాలనలోని అవకతవకలను ఎత్తి చూపుతున్నారు. తాజాగా ఆయన మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, టీడీపీ నేతలు దీనికి కొత్త రంగు పులిమారు. అంతేకాకుండా, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కొత్త లింక్ పెట్టారు.
వీర్రాజు ఓకే అంటే వాళ్లు చేరిపోతారట
తాజాగా జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో ద్వితీయ ప్రత్యామ్నాయ పార్టీగా బీజేపీ ఎదుగుతోందన్నారు. బీజేపీలో చేరేందుకు పెద్దఎత్తున టీడీపీ నాయకులు సిద్ధంగా ఉన్నారని వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం విషయంలో టీడీపీ భారీ అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని చంద్రబాబు తిట్టించవచ్చా..?. నేను చంద్రబాబుని తిట్టకూడదా..?. చంద్రబాబు పాలన అవినీతి, బంధుప్రీతితో నిండిపోవడం వల్లే ప్రజలు వైఎస్సార్సీపీకి పట్టం కట్టారని వీర్రాజు అన్నారు. ఏపీలో నిజమైన ప్రతిపక్షం బీజేపీయే అని ప్రకటించారు.
టీడీపీ భగ్గుమంటోంది తెలుసా?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ భగ్గుమంది. పార్టీ నేత, మాజీ మంత్రి కె.ఎస్. జవహర్ మీడియాతో మాట్లాడుతూ వీర్రాజు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచించారు. పోలవరం విషయంలో ఏం జరిగిందో తెలుసుకోండి. కేంద్ర జలశక్తి మంత్రికి ఫోన్ చేసి పోలవరంలో అవినీతి జరిగిందో లేదో కనుక్కోండి. వాస్తవాలు తెలుస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు రాసిచ్చిన స్ర్కిప్ట్ చదవడం మాని వాస్తవాలు తెలుసుకోండి అంటూ విరుచుకుపడ్డారు. పోలవరంలో ఎటువంటి అవినీతి జరగలేదని కేంద్ర జలశక్తి మంత్రి పార్లమెంటు సాక్షిగా చెప్పినా దుష్ప్రచారం చేయడం సరికాదని జవహర్ చెప్పుకొచ్చారు. “నీతి అయోగ్ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్మాణం బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించిన విషయం మీకు తెలియదా? లేని అవినీతి జరిగిందని దుష్ప్రచారం చేయడం వైసీపీ దుష్టశక్తుల కోసం కాదా? “ అంటూ సంచలన కామెంట్లు చేశారు. వైసీపీ నేతలను తనకు అంటగట్టడంపై వీర్రాజు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?