ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అయితే, తెలుగు ప్రజలు అధికంగా నివసిస్తున్న హైదరాబాద్ విషయంలో కొత్త టెన్షన్ తెరమీదకు వచ్చింది. కరోనా వచ్చిన తగ్గిన వారిని ఇప్పుడు పోస్ట్ కోవిడ్ అనారోగ్య సమస్యలు టెన్షన్ పెడుతున్నాయి.
హైదరాబాద్లో కొత్త టెన్షన్
కోవిడ్ వచ్చి కోలుకున్న అనంతరం ఆరోగ్య ఇబ్బందులతో ప్రస్తుతం హైదరాబాద్ నగర ఆసుపత్రులలో వందలాది పోస్ట్ కోవిడ్ పేషెంట్స్ జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు చాలా మంది రోగులు ఇంటిలోనే క్వారెంటైన్ అయ్యి తెలిసిన మందులతో ఈ కరోనాని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వారి కంటే ఎక్కువగా ఆసుపత్రులలో చేరి చికిత్స పొందిన వారికే ఈ పోస్ట్ కోవిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టు ఓ కార్పోరేట్ ఆసుపత్రి వర్గాల నుండి అందుతున్న సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ గాంధీ ఆసుపత్రి సహా నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రులలో 300 పోస్ట్ కోవిడ్ కేసుల రోగులు చికిత్స పొందుతున్నట్టు చెబుతున్నారు.
ఇవే డేంజర్ సమస్యలు
ఈ పోస్ట్ కోవిడ్ సమస్యలు కొన్ని పెద్దగా ఇబ్బంది కల్గించకున్నా వైద్య సహాయం అవసరమయ్యే తీవ్రమైన సమస్యలలో పక్షవాతం, గుండెపోటు మరియు డయాలసిస్, అలానే మల్టీ ఆర్గాన్ ఫైల్యూర్ లాంటివి ఉన్నాయి. వైరస్ వచ్చి తగ్గిన 15 రోజుల నుండి 3 నెలల వరకు కనిపించే ఈ తీవ్రమైన పోస్ట్-కోవిడ్ సమస్యలకు ప్రధాన కారణం ఏమిటంటే, కరోనా వైరస్ వలన రక్త నాళాల గడ్డకట్టుకు పోయి ఈ ఇబ్బందులు తలేత్తుతున్నట్టు చెబుతున్నారు. మరియు దాని ప్రభావం గడ్డకట్టే ప్రదేశంపై ఆధారపడి ఉంటుందని అంటున్నారు.
ఎక్కువ నష్టం ఇప్పుడే
కరోనా రోగికి జరగాల్సిన ఎక్కువ నష్టం ఈ పోస్ట్ కోవిడ్ కాలంలోనే జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు. స్టెరాయిడ్ చికిత్స, యాంటీ కోగ్యులెంట్స్, యాంటీ ప్లేట్లెట్స్ చికిత్సలను ప్రారంభంలోనే ప్రారంభించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. కోవిడ్ -19 తో సమస్య ఏమిటంటే, మరణాలు తక్కువగా ఉన్నప్పటికీ, ఈ వైరస్ వలన వస్తున్న పోస్ట్ కోవిడ్ ఇబ్బందులతో మొదటి 10 రోజుల్లో హాజరు కాకపోతే అది అలాగే ఉంటుందని చెబుతున్నారు. ఈ కరోనా మొదట్లో ప్రతి ఒక్కరూ ఆసుపత్రికి వచ్చేవారని కానీ ఇప్పుడు ఇప్పుడు చాలా కేసులు కాంప్లికేట్ అయితేనే చాలా ఆలస్యంగా వస్తున్నాయని చెబుతున్నారు.