NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కేసీఆర్ క‌ల .. హైద‌రాబాద్‌లో నెర‌వేరుతోంది ఇలా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌ల నెర‌వేరేందుకు వేగంగా అడుగులు ప‌డుతున్నాయి. ల‌క్ష్యం సాకారం అవ‌డంలో భాగంగా అధికారులు శ్ర‌మిస్తున్నారు.

 

హైద‌రాబాద్‌లో ఉన్న ప్ర‌స్తుత స‌చివాల‌యం ప్రాంగ‌ణంలోనే కొత్త స‌చివాల‌యం నిర్మాణానికి సిద్ధ‌మైన సంగ‌తి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ప‌నులు ప్రారంభం అయ్యాయి. నూతన సచివాలయ భవన నిర్మాణ ప‌నుల‌ను ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌, రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డి క‌లిసి ప‌రిశీలించారు.

 

కొత్త స‌చివాల‌యం

2019, జూన్ 26వ తేదీన వేద పండితులు నిర్ణయించిన శుభముహూర్తంలో సమీకృత కొత్త సచివాలయం పనులకు ముఖ్య‌మంత్రి కేసీఆర్ శంకుస్థాప‌న చేసిన విష‌యం తెలిసిందే. ఈ స‌చివాల‌యం నిర్మాణానికి షాపూర్జీ పాల్లొంజీ సంస్థ ఎంపిక అయింది. సమీకృత కొత్త సచివాలయానికి ఇప్పటికే ఔట్ లైన్ ముగ్గు పోసిన‌ షాపూర్జీ పాల్లొంజీ నిర్మాణ సంస్థ ప‌నులు ప్రారంభించింది. పనుల ప్రారంభ సూచకంగా తెలంగాణ‌ ప్రవేశద్వారం సమీపంలో ఈ మధ్యే నిర్మించిన కమాన్ వెనక క‌న్‌స్ర్ట‌క్ష‌న్‌ సైట్ ఈశాన్య భాగంలో నిర్మాణ సంస్థ గొయ్యి తవ్వింది. సచివాలయం నిర్మాణ పనులపై ఎర్రమంజిల్‌ ఆర్‌అండ్‌బీ కార్యాలయంలో రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి సంబంధిత అధికారులు, వర్క్‌ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం మేరకు సచివాలయం నిర్మాణ పనులు 12 నెలల్లో పూర్తి కావాలని సూచించారు. ఇందుకోసం మొత్తం భవనాన్ని ఆరుప్రాజెక్టులుగా విభజించి ఒక్కోప్రాజెక్టుకు ఒక్కో వర్కింగ్‌ బృందం పర్యవేక్షించాలని చెప్పారు. ప్రాజెక్టుకు ఇద్దరు చొప్పున మొత్తం 12మంది జేఈలను, అదేవిధంగా ముగ్గురు డీఈలు, ఒక ఈఈ, ఒక ఎస్‌ఈతోపాటు ప్రత్యేకంగా మెకానికల్‌ పనుల కోసం.. ముగ్గురు జేఈలను, ఇద్దరు డీఈలను ఒక ఈఈని నియమించుకోవాలని సూచించారు.

కంపెనీ సైతం….

మ‌రోవైపు స‌చివాల‌య నిర్మాణ సంస్థ షాపూర్‌జీ నుంచి కూడా.. 12మంది ఫీల్డ్‌ ఇంజినీ ర్లు, ఆరుగురు ప్రాజెక్టు ఇంజినీర్లు ఒక ప్రాజెక్టు మేనేజర్‌ను నియమించాలని మంత్రి ఆదేశాలు వెలువ‌రించారు. ఆర్కిటెక్ట్‌ వైపు నుంచి ఆరు సూపర్‌వైజింగ్‌ బృందాలు సైట్‌లో పనిచేసేలా చూడాలని చెప్పారు. ఆర్‌అండ్‌బీ శాఖ తరఫున ఎస్‌ఈ, అర్కిటెక్ట్‌, షాపూర్‌జీ సంస్థకు చెందిన ముగ్గురు కలిసి, ప్రాజెక్టుకు సంబంధించి నెలవారీగా ఏఏ పనులు పూర్తిచేయాలో.. 11 నెలలు లక్ష్యంగా పీఈఆర్టీ చార్ట్‌ను వెంటనే సిద్ధం చేయాలని తెలిపారు. ప్రతివారం స్వయంగా పనులను పర్యవేక్షిస్తానని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలకనుగుణంగా, తెలంగాణ ఖ్యాతిని చాటేలా సచివాలయ భవనం నిర్మా ణం ఉండాలని వెల్లడించారు.

author avatar
sridhar

Related posts

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?