తెలుగులోనే కాదు తమిళంలో ను మంచి ఫాం లో ఉన్న స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్. వరస చిత్రాలతో హీరోల కంటే బిజీగా ఉంది. ఈ బ్యూటి నటించిన తాజా చిత్రం పెంగ్విన్. ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కించారు. అయితే తాజాగా ఈ సినిమా నుండి లేటెస్ట్ న్యూస్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో జూన్ 19 న రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గ అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయయి. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో ప్రముఖ తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాని నిర్మించాడు.
ఇక జూన్ 19 న నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా నుండి జూన్ 8 న టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం పెంగ్విన్ సినిమా పోస్టర్ ని రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకే పది రోజులు ముందు ఈ సినిమా నుండి టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ టీజర్ తో సినిమా ఎలా ఉండబోతుందో అన్న హింట్ ఇవ్వనున్నారట చిత్ర బృందం.
ఇక అటు తమిళ ఇండస్ట్రీ తో పాటు ఇటు తెలుగు ఇండస్ట్రీలో కీర్తి సురేష్ కి విపరీతమైన పాపులారిటి ఉంది. చెప్పాలంటే హీరోల తో సమానంగా భారీ సినిమాలలో నటిస్తూ బీజీగా ఉంది కీర్తి సురేష్. ఇక పెంగ్విన్ తర్వాత నితిన్ తో నటించిన రంగ్ దే కూడా రిలీజ్ కి సిద్దమవుతుంది. ఆగస్టు లో ఈ సినిమా రిలీజ్ అయ్యో అవకాశాలున్నాయి. అంతేకాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ అన్నాత్తే సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుండటం విశేషం.