గత నెల 26న శంషాబాద్ పరిధిలోని రాళ్ళపల్లిలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లావణ్య లహరి భర్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే. భర్త, లావణ్యను వేధిస్తున్న వీడియో కూడా బయటకు వచ్చింది.
అయితే ఘటన జరిగిన దగ్గరనుండి భర్త, అత్తమామలు, ఆడపడుచులు పరారీలో ఉన్నారు. శంషాబాద్ పోలీసులు భర్త వెంకటేష్, అత్తమామలు సుబ్బారావు, రమాదేవి, ఆడపడుచులు కృష్ణవేణి, లక్ష్మీకుమారిలపై కేసు నమోదు చేసారు. శంషాబాద్ ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా వారు ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం వైమడుగు గ్రామంలో బంధువుల ఇంట్లో తలదాచుకుంటుండగా స్థానిక పోలీసుల సహాయంతో వారిని అదుపులోకి తీసుకుని హైదరాబాద్ తరలించారు.