దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులర్పించి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ తనయుడు, ఏపి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను సందర్శించి నివాళులర్పించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా నిన్న పులివెందుల నియోజకవర్గానికిి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ .. వేల్పుల పంచాయతీ కాంప్లెక్స్ ను ప్రారంభించారు. రాత్రి ఇడుపులపాయ గెస్ట్ హౌస్ లో బస చేసిన సీఎం జగన్ .. ఉదయం వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఈ ప్రార్ధనల్లో తల్లి విజయమ్మ, సోదరి షర్మిల తదితర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
మరో పక్క రాష్ట్ర వ్యాప్తంగా వైెఎస్ వర్ధంతి కార్యక్రమాలను వైసీపీ నేతలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇన్ చార్జీల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయనకు నేతలు ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు, జగన్ అభిమానులు రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నారు. పేదలకు అన్నదాన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ప్రతి అడుగులోనూ నాన్నే స్పూర్తిగా..
మరో పక్క వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సీఎం జగన్ ట్విట్టర్ వేదికగా నివాళులర్పిస్తూ .. వైఎస్ఆర్ ను స్మరించుకున్నారు. “నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశ చరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటి చెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్పూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది” అంటూ జగన్ ట్వీట్ చేశారు.
వేల్పుల సచివాలయ కాంప్లెక్స్ ను ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్ .. ఈ ప్రాంగణం ప్రత్యేకత ఏమిటంటే..?
నాన్న భౌతికంగా దూరమైనా నేటికీ ఆయన చిరునవ్వు, ఆ జ్ఞాపకాలు అలానే నిలిచి ఉన్నాయి. దేశచరిత్రలోనే సంక్షేమాన్ని సరికొత్తగా నిర్వచించి.. ప్రజల అవసరాలే పాలనకు ప్రధానాంశం కావాలని ఆయన చాటిచెప్పారు. ప్రతి అడుగులోనూ నాన్నే స్ఫూర్తిగా ఇకపై కూడా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తుంది.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 2, 2022