Venkateswaraswamy : ఇలాంటి సమస్యలు ఉన్నవారు:
కోట్లాది భక్తులకు ఇల వేలుపు, ఆపద మొక్కులవాడు అనాథ రక్షకుడు, పిలిస్తే పలికే కలియుగ దైవం,కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసుడు కష్టం నుండి కాపాడే దైవం అని భావించి స్వామి వారికి తమకు వచ్చిన కష్టం చెప్పుకుని లేదా కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టే వాళ్ళు .
ఎలాంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే… వివాహం జరగడం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లలు కలగడం కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం లేదా అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగ కుండా చేతికి రావాలి అని, ఆటంకం లు ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇలాంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసుని కి తమ కష్టం చెప్పుకుని ముడుపు కడతారు
Venkateswaraswamy : ముడుపు ఎలా కట్టాలి అనేది తెలుసుకుందాం.
స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన పూర్తి చేసుకుని ముందుగా వినాయకుడి దగ్గర మీ కోరిక చెప్పుకుని ,స్వామికి ముడుపు కడుతున్న సంకల్పము నెరవేరాలి అని ప్రార్ధించి,ఒక తెల్లటి బట్ట ని పసుపు లో తడిపి ఆరబెట్టి.. ఆ వస్త్రానికి నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామిని స్మరించుకుంటూ పెట్టి.. మీరు ముడుపు కట్టడానికి గల కారణాన్ని మనసుపూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి వారి ఫోటో ముందు ఉంచాలి.
కోరిక తీరాక ముడుపుతో దర్శనంకి వస్తాను అని ముందే ఆయనకీ మాటఇవ్వాలి,తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం , గోవిందా నామాలు చదువుకొని స్వామి కి హారతి ఇచ్చినతర్వాత ముడుపుకి కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొనిమరికాస్త డబ్బులు కలిపి ఆ మొత్తాన్ని హుండీలో వేసి కృతజ్ఞత తెలియచేసుకోవాలి. ఇది భక్తిగా, నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెబుతారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?