LIC : ప్రముఖ బీమా సంస్థ దిగ్గజం అయినటువంటి (లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) తన పాలసీదారులకు ఓ శుభవార్త చెప్పింది. అదేమంటే, గతంలో రకరకాల కారణాలతో ల్యాప్స్ అయిన పాలసీలను రెన్యువల్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కరోనా పుణ్యమాని జీవిత బీమా కవరేజీకి మరింత ఎక్కువ ప్రాధాన్యం పెరిగింది.
ఈ నేపథ్యంలో పాలసీదారుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని LIC ఈ ఆఫర్ ప్రకటించింది. అయితే, ఇక్కడ ఓ నియమ నిబంధన వుంది. ప్రస్తుతం ల్యాప్డ్ కండిషన్లో ఉండి, పాలసీ టర్మ్ను పూర్తి చేయని వాటిని మాత్రమే కన్సిడర్ చేస్తారు. వారికి మాత్రమే ఈ రెన్యువల్ అవకాశం వుంది.
LIC : ఈ అవకాశం ఎప్పటినుండి ఎప్పటివరకు?
నిన్నటినుండి అనగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ క్యాంపెయిన్ మార్చి 25న ముగియనుంది. ఈ గడువులో పాలసీ రెన్యువల్కు చేసుకోవాలని వచ్చే వారికి ఆలస్య రుసుములో రాయితీ కూడా ఇస్తామని LIC ప్రకటించడం గమనార్హం. అలాగే ఇంకోవైపు మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు ఆలస్య రుసుమును పూర్తిగా మినహాయిస్తున్నట్లు LIC ప్రకటించడం హర్శించదగ్గ విషయం. నిలిచిపోయిన ప్రీమియం విలువ రూ. 1 లక్ష వరకు ఉంటే ఆలస్య రుసుములో 20 శాతం, గరిష్టంగా 2,000 వరకు రాయితీ ఇవ్వనున్నట్లు పేర్కొంది.
మరిన్ని వివరాలు:
ఈ సందర్భంగా LIC కరోనా కష్టకాలంలో ఇన్సూరెన్స్ పాలసీ యెక్క ప్రాముఖ్యతను వివరిస్తోంది. సదరు కుటుంబాలకు ఆర్థిక భద్రతను ఇవ్వడానికి ల్యాప్స్ అయిన ఖాతాలను రెన్యువల్ చేసుకునే ఆప్షన్ కల్పిస్తున్నామని చెబుతున్నారు. కాబట్టి పాలసీదారులారా! మీ పాలసీలను రెన్యువల్ చేసుకునేందుకు ఇది చాలా మంచి తరుణం. ఈ అవకాశాన్ని పాలసీదారులు ఉపయోగించుకోవాలని న్యూస్ ఆర్బిట్ వేదికగా కోరుతున్నాం.