లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)కి చెందిన గోల్డెన్ జూబ్లి పౌండేషన్ స్కాలర్షిప్ లకు ప్రకటన విడుదల చేసింది..! 2020 విద్యాసంవత్సరానికి ఆర్థికంగా బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు కొనసాగించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది.. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా చేసుకోవాలి.. పూర్తి వివరాలు ఇలా..
స్కాలర్షిప్ల ఖాళీలు :
దేశవ్యాప్తంగా ఎల్ఐసీ డివిజనల్ సెంటర్ ఒక్కోదానికి 20 చొప్పున రెగ్యులర్ స్కాలర్షిప్లు(బాలురు-10, బాలికలు-10). ప్రతి ఎల్ఐసీ డివిజన్ పరిధిలో కేవలం బాలికలకు 10 ప్రత్యేక స్కాలర్షిప్స్ (పదోతరగతి పూర్తి చేసిన వారికి).
అర్హతలు :
2019-20 విద్యాసంవత్సరంలో కనీసం 60% మార్కులతో పదోతరగతి, ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత. పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/ సంస్థల్లో ఒకేషనల్/ ఐటీఐ సంబంధిత కోర్సులు చదువుతూ ఉండాలి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్, గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/ తత్సమాన ఉన్నత విద్య చదువుతూ ఉండాలి.
ఎంపిక విధానం :
టెన్త్, ఇంటర్లో పొందిన మార్కుల మెరిట్, కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆధారంగా అభ్యర్థులను స్కాలర్ షిష్నకు ఎంపిక చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఇది ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది.
స్కాలర్షిప్ వివరాలు :
ఈ స్కాలర్షిప్కు ఎంపికైన విద్యార్థికి ఏటా రూ. 20,000 లను మూడు విడతలుగా చెల్లిస్తారు. స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కీమ్ కింద ఎంపికైన విద్యార్థినులకు నెలకు రూ.10,000 చొప్పున రెండు సంవత్సరాలు ఇస్తారు. ఈ మొత్తాలను నేరుగా అభ్యర్థుల బ్యాంకు ఖాతాలకు పంపుతారు. ఇలా కోర్సు పూర్తయ్యే వరకు అందజేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.
వెబ్ సైట్:https://www.licindia.in/
చివరి తేది: 31.12.2020.