టాలీవుడ్ తో సహా కోలీవుడ్ లోను నిత్యా మీనన్ కి హీరోయిన్ గా మంచి పేరుంది. అలా మొదలైంది, ఇష్క్, సన్నాఫ్ సత్యమూరి, అ లాంటి చిత్రాలతో నిత్యా మీనన్ బాగా పాపులర్ అయింది. అయితే ఏ సినిమా ఒప్పుకున్న తనకి కథ నచ్చాలి… ఆ కథ లో తన పాత్ర ఎంతో ఛాలెంజింగ్ గా ఉండాలి. అలాంటి పాత్రలకే నిత్యా ప్రాధాన్యం ఇస్తుంది. ఇక గత సంవత్సరం బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘మిషన్ మంగళ్’ లో ఒక ముఖ్య పాత్ర పోషించి బాగా ఆకట్టుకుంది.
ఇక రీసెంట్ గా స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ తో వెబ్ సిరీస్ లో నటించింది. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’ వెబ్ సిరీస్ లో నటించి బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం నిత్యా మీనన్ దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఐరన్ లేడీ’ లో నటిస్తుంది. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన నిత్యా తాజాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. కరోనా కారణంగా జీవితం పోరాటంగా మారిందని తెలిపింది.
ఇక షూటింగ్కి వెళితే అది పూర్తవగానే అక్కడితోనే మరచిపోతాను.. ఇంటి వరకు ఆ ప్రస్తానం తీసుకురానని చెప్పింది. అంతేకాదు షూటింగ్లో ఉన్నంతసేపు నిజ జీవితం గురించి మరచిపోతానని చెప్పింది. వ్యక్తిగత కష్టనష్టాలను షూటింగ్ దరిదాపులకుకూడా తీసుకురానని.. ఒక్కోసారి నేను పోషించిన పాత్రలు మనసును విపరీతంగా హత్తుకుంటాయని వెల్లడించింది. ఈ లాక్డౌన్ సమయం మన గురించి మనం తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడిందని వెల్లడించింది.