Life lessons: శుక్ర , శనివారాల నియమాలు పెట్టుకున్నవారు హోటల్స్ టిఫిన్ తినడం ఆహారం లో ఉల్లి వాడడం వంటివి చేయకూడదు.ప్రయాణం లో ఉంటే ఈ నియమం పనిచేయదు.
చీటికీ మాటికీ యజ్ఞోపవీతం తీసేసి పక్కనపెట్టడం, తాళి తీసేయడం రెండు మహా దోషాలు.
- దీపాలు పెట్టె వేళ తల దువ్వకూడదు
- దిగంబరం గా నిద్రపోకూడదు.
- దీపారాధనకు అగ్గె పెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు. కాబట్టి అగ్గి పెట్టెను వాడొచ్చు.
- కొబ్బరికాయని నీళ్లతో కడిగి కొట్టటం చాల తప్పు… పీచు తీసాక కొబ్బరికాయని కడగకూడదు.
- మాడిన అన్నం, అడుగంటిన పాయసం, కంపు కొట్టే నేయి న్యేవేద్యం గా వాడరాదు.
- అతిధులకు పాడైన పదార్ధాలు పొరపాటునకూడా పెట్టరాదు. ఇల్లు పట్టించుకోకుండా రోజంతా వీధులలో తిరిగే స్త్రీ ముఖం చుస్తే గోహత్యమహాపాతకం చుట్టుకుంటుంది.
- గురువుగారితో కలిసి యాత్రలు చేసేటప్పుడు ఆయన కన్నా ముందు నడవకూడదు.
- నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం. కాబట్టి ఆకులో కానీ, కొత్త పాత్రలలో గాని వారికీ ఆహారం పెట్టాలి.
- జపమాల మెడలో వేసుకోరాదు. మెడలో వేసుకునే మాలతో జపం చేయరాదు.
- బంగారం దొరికితే అది ఇంటికి తేరాదు . అలా తెస్తే అనర్ధాలు జరుగుతాయి. కాబట్టి దొరికిన వెంటనే..దానం చేయాలి లేదా ఆలయానికి ఇచ్చివేయాలి.
- తలమీద రెండు చేతులు ఒకేసారి పెట్టుకోరాదు.
- వికలాంగులను వేళాకోళం చేయరాదు.
- తల్లిదండ్రులకు నిత్యం పాదాలకు నమస్కారం చేయడం కన్నా ధర్మం, నిత్యాన్నదానం కన్న పుణ్యం ఈ సృష్టిలోనే లేదు.
- ఏడవడం వలన దారిద్యం, సంతోషం గా ఉంటే ఐశ్వర్యం కలుగుతాయి.
- ప్రమాద వశాత్తు చనిపోయినవారికి పిశాచ జన్మవస్తుంది. వారి విముక్తికి భాగవత సప్తాహం ఒక్కటే మార్గం.
- అతిధులకు అరటి ఆకులు, విస్తరాకులు, వెండి పళ్ళెములో మాత్రమే భోజనం పెట్టాలి.
- తన మతమును వదిలి, అన్యమతాన్ని స్వీకరించిన వాడు తల్లిని పొందినటువంటి పాపము కలుగుతుంది. అతిధులకు భోజనం పెట్టేవారు శ్రాధ కాలం లో తప్ప ఒకే రోజు గారెలు, పాయసం వండి పెట్టకూడదు.
- కలియుగం లో పురాణం వినడంకన్న వేరే ధర్మం లేదు. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సమయం లో పురాణం వినాలి..భోజనం చేసేటప్పుడు మాట్లాడటం, నవ్వడం అస్సలు చేయకూడదు.
- గురువుతో మాట్లాడేటప్పుడు చేయి అడ్డం ఉంచుకుని మాట్లాడాలి.
- దానమిచ్చిన వాటిని ఎట్టి పరిస్థితులలో వెనక్కి తీసుకోరాదు. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో అలా తీసుకోవలసి వస్తే ధనం చెల్లించి మాత్రమే తీసుకోవాలి.