Liger : లైగర్ సినిమా చిత్రీకరణలో టాలీవుడ్ డాషింగ్ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఫుల్ బిజీ కాబోతున్నాడు. యంగ్ అండ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండను పాన్ ఇండియన్ స్టార్ గా చూపించేందుకు ప్లాన్ చేస్తున్నాడు పూరీ. ఈ మూవీ షూటింగ్ పూర్తి కాగానే తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేపట్టేందుకు రెడీ అవుతున్నాడు. ఈ క్రమంలోనే జనగణమన ప్రాజెక్ట్ మళ్ళీ తెరపైకి వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ ప్రాజెక్ట్ చేయాలని పూరీ డిసైడ్ అయ్యారట. అందుకు తగ్గట్లుగానే ప్లాన్ వేస్తున్నాడని తాజా సమాచారం . లాక్ డౌన్ వల్ల ముంబై లో ఉంటున్న పూరీ విజయ్ దేవరకొండ లైగర్ షెడ్యూల్ ని మొదలు పెట్టబోతున్నాడు.
ఈ సినిమా కంప్లీట్ చేస్తూనే పవర్ స్టార్ తో తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చర్చలు జరపాలని నిర్ణయించుకున్నాడట. ఇప్పటికే రెండు సార్లు జనగణమన ప్రాజెక్ట్ గురించి పవన్ తో డిస్కస్ చేసిన పూరీ ఈసారి షూటింగ్ డేట్స్ లాక్ చేయాలని స్కెచ్ వేసినట్టు చెప్పుకుంటున్నారు. అయితే ఓ వైపు రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూనే చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీ గా ఉన్నారు పవన్ కళ్యాణ్. అయినా కూడా పూరి తో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ చేయాలని పవన్ కూడా అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. గతం లో వీరిద్దరి కలయికలో వచ్చిన బద్రి, కెమరామెన్ గంగ తో రాంబాబు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సక్సస్ లను అందుకున్న సంగతి తెలిసిందే.
Liger : మహేష్ బాబు తో చేయాలని అనుకున్న జనగణమన పవన్ కళ్యాణ్ తో..?
కాగా మళ్ళీ ఇంతకాలానికి ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా పట్టాలెక్కబోతుందని లేటెస్ట్ అప్డేట్. ఇక వచ్చే ఎన్నికల కన్నా ముందే జనగణమన పూర్తి చేయాలనీ పూరీ ప్లాన్ చేస్తున్నాడట. ప్రస్తుత రాజకీయాలకు తగ్గట్లుగా ఫుల్ పంచ్ డైలాగు లతో సినిమా రూపొందించబోతున్నాడట పూరి. ప్రస్తుతం ఇటు చేతినిండా సినిమాలతో పవన్ అటు లైగర్ తో పూరీ ఫుల్ బిజీ గా ఉన్నారు. వీరిద్దరి ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వాలంటే ఎంత లేదన్నా 2022 వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు. ఇక ఈ ప్రాజెక్ట్ వాస్తవంగా మహేష్ బాబు తో చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే.