Liger : లైగర్ …పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా. విజయ్ దేవరకొండ – అనన్య పాండే జంటగా నటిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బాలీవుడ్ స్టార్ మేకర్ కరణ్ జోహార్ సమర్పిస్తుండగా పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్ – ఛార్మి కలిసి 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఇప్పటికే ముంబై లో 40 శాతం టాకీపార్ట్ కంప్లీట్ అయింది. విజయ్ దేవరకొండ తో రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా లైగర్ తెరకెక్కుతోంది. కాగా లైగర్ సినిమాని విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో పూరి జగన్నాధ్ సెన్షేషనల్ హిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు.
ఇస్మార్ట్ శంకర్ లాంటి మాస్ కమర్షియల్ హిట్ తర్వాత పూరి జగన్నాధ్ నుంచి లైగర్ రాబోతుండటంతో అందరిలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందన్న ఆతృత అక్కడి మేకర్స్ లో ఉంది. ఈ సినిమా మీదే అటు విజయ్ దేవరకొండ గాని ఇటు పూరి జగన్నాధ్ బాలీవుడ్ లో కెరీర్ ఆధారపడి ఉంది. ఇక మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని సీరియస్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందించనున్నాడు పూరి జగన్నాధ్. అయితే తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ- అనన్య లమీద ఒక షెడ్యూల్ ని ముంబైలో ప్రారంభించనున్నారట.
Liger : అన్ని అనుకున్నట్టు జరిగితే ….!
ఈ షెడ్యూల్ వచ్చే వారం నుండి మొదలబోతుందని సమాచారం. భారీ యాక్షన్ సీక్వెన్సులతో మరో షెడ్యూల్ ను ప్లాన్ చేసారు. ఈ షెడ్యూల్ తో దాదాపు లైగర్ కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇక అన్ని అనుకున్నట్టు జరిగితే జూలై లేదా ఆగష్ట్ లో లైగర్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. కాగా పూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో అన్నది తెలియాల్సి ఉంది.