ఈరోజు ఉదయం “లైగర్” తెలుగు ట్రైలర్ హైదరాబాద్ లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద సుదర్శన్ థియేటర్ లో రిలీజ్ కార్యక్రమం జరగడం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హీరో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్ అనన్య పాండే డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు సహనిర్మాతలు చార్మి, కరణ్ జోహార్ హాజరయ్యారు. ట్రైలర్ ని ప్రభాస్ మరియు చిరంజీవి ఇంటర్నెట్ లో విడుదల చేయడం జరిగింది. విడుదలైన “లైగర్” తెలుగు ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్ లో దూసుకుపోతుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా వచ్చి దాదాపు మూడు సంవత్సరాలకు పైగా కావటంతో పాటు ఫస్ట్ టైం పాన్ ఇండియా నేపథ్యంలో సినిమా తెరకక్కించడంతో… సినిమా ఇండస్ట్రీ చాలా ఆసక్తిగా ఎదురు చూడడం జరిగింది.
ఈరోజు ఉదయం “లైగర్” ట్రైలర్ రిలీజ్ కావటంతో ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ రావడం జరిగింది. ఏకంగా 20 మిలియన్ వ్యూస్ సాధించటం మాత్రమే కాదు… నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచింది. 24 గంటలు గడవక ముందే ఈ రీతిగా “లైగర్” ట్రైలర్ రెస్పాండ్ సాధించడంతో రాబోయే గంటలలో ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. విజయ్ దేవరకొండ అభిమానులు ట్రైలర్ పట్ల ఫుల్ హ్యాపీగా ఉన్నారు. చాయ్ వాలా నుండి ఇంటర్నేషనల్ బాక్సర్ గా విజయ్ దేవరకొండ నీ పూరి జగన్నాథ్ చూపిస్తున్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు ట్రైలర్ లో చూస్తే నత్తివాడిగా విజయ్ దేవరకొండ నటించినట్లు అర్థమవుతుంది. వరుస ప్లాపులలో ఉన్న విజయ్ దేవరకొండ “లైగర్” పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. విజయ్ దేవరకొండ అభిమానుల సైతం ఈ సినిమాతో ఎలాగైనా మళ్ళీ తమ అభిమాన హీరో హిట్ ట్రాక్ ఎక్కాలని కోరుకుంటున్నారు. ఆగస్టు 25వ తారీకు పాన్ ఇండియా నేపథ్యంలో తెలుగు, మలయాళం, తమిళం, హిందీ ఇంకా మరికొన్ని భాషలలో విడుదల చేస్తున్నారు.