సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా. ప్రతి ఒక్కరూ గుర్తింపు కోసం రకరకాల పనులు చేస్తూ సోషల్ మీడియాలో ఫోటోలు పెడుతున్నారు. గతంలో ఎక్కువగా సినిమా రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ వ్యక్తిగత సమాచారాన్ని తెలియజేసే వాళ్లు. మీడియాలో తమకు వ్యతిరేకంగా ఎలాంటి వార్త వచ్చినా, రూమర్లు వస్తున్న సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చేవారు.
ఇప్పుడు తాజాగా రాజకీయ రంగానికి చెందిన నాయకులు కూడా సోషల్ మీడియా ని బాగా వాడుతూ తమ నియోజకవర్గాలలో పార్టీకి సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు అదేవిధంగా ప్రభుత్వ కార్యక్రమాలు పథకాలు సోషల్ మీడియా ద్వారా వైరల్ చేస్తున్నారు. సమాజాన్ని చాలావరకూ ఎలక్ట్రానిక్ మీడియా కంటే సోషల్ మీడియా ప్రభావితం చేస్తూ ఉంది.
ఇటువంటి నేపథ్యంలో ఏపీలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకి సరైన రెస్పాండ్ ప్రజల నుండి రావడం లేదని జగన్ తాజాగా తన ఎమ్మెల్యేలకు పార్టీ ప్రజాప్రతినిధులకు సోషల్ మీడియా వాడే విధానం గురించి స్పెషల్ క్లాసులు ఓ ప్రముఖ సంస్థ చేత చెప్పించ నున్నట్లు ఇటీవల వార్తలు రావడం మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఇదే మాదిరిగా జగన్ తరహాలోనే కేసీఆర్ కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యేలకు సోషల్ మీడియా పై అవగాహన కనిపించబోతున్నారు అని తెలంగాణ రాజకీయ వర్గాలలో టాక్. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ ఓటమి చెందడంతో… పాటు సోషల్ మీడియా వాడే విధానం విషయంలో బీజేపీ చాలా చురుకుగా ఉండటం తో… కెసిఆర్ అలర్ట్ అవుతున్నట్లు టాక్. ఈ నేపథ్యంలో గ్రేటర్ ఎన్నికలలోనే టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించే విధంగా టిఆర్ఎస్ అధినాయకత్వం సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.