Narappa : నారప్ప..ఇటీవల అమెజాన్ ప్రైం లో వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. విక్టరీ వెంకటేశ్ – ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా థియేటర్స్ రిలీజ్ కాకపోయినా కూడా రెస్పాన్స్ మాత్రం అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవితో సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులు నారప్ప సినిమాలో వెంకటేశ్ పర్ఫార్మెన్స్ అద్భుతం అని ఈ పాత్ర ఆయన తప్ప మరెవరూ చేయలేరని ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక చాలా కాలం తర్వాత జాతీయ అవార్డ్ విన్నర్ ప్రియమణి నారప్పతో టాలీవుడ్లో రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకొని కం బ్యాక్ అయింది.
నారప్ప సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో వెంకీ నెక్స్ట్ సినిమా దృశ్యం 2 కూడా ప్రముఖ ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన స్ట్రీమింగ్ ఢీల్ కూడా కంప్లీట్ అయిందని తాజా సమాచారం. మలయాళంలో సూపర్ హిట్ అయిన దృశ్యం సినిమాకి సీక్వెల్గా దృశ్యం 2 రూపొందించారు. ఇందులో కూడా వెంకీ జంటగా సీనియర్ హీరోయిన్ మీనా నటించారు. ఇప్పటికే అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకిని రిలీజ్కి రెడీగా ఉంది. ఈ సినిమాను థియేటర్స్ రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరీనా సెకండ్ వేవ్ కారణంగా సాధ్యపడలేదు.
Narappa : సెప్టెంబర్లో దృశ్యం 2 సినిమా రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట.
ఇప్పుడు నారప్ప వచ్చి నిర్మాతలకి మంచి లాభాలను తీసుకు వచ్చింది. దాంతో ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా విడుదల చేసేందుకు ఢీల్ కుదిరింది. వాస్తవంగా అయితే ఈ పాటికే దృశ్యం 2 స్ట్రీమింగ్ కావాల్సింది. అయితే నారప్ప రిలీజ్ లేటవడంతో దృశ్యం 2 రిలీజ్ లేట్ అయింది. కాగా సెప్టెంబర్లో దృశ్యం 2 సినిమా రిలీజ్ కి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. దృశ్యం 2 అన్నీ అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ 9న లేదా 10న రిలీజ్ చేయడానికి డేట్ కూడా అనుకుంటున్నారట. త్వరలో అధికారకంగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తారని టాక్ వినిపిస్తోంది.