ఇటీవల గాల్వాన్ లోయ ప్రాంతంలో భారత్ ఆర్మీకి చెందిన 20 మంది సైనికులను చైనా తన దూకుడు చర్యలతో పొట్టన పెట్టుకున్న సంగతి అందరికీ తెలిసిందే. సరిహద్దు ప్రాంతంలో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ చైనా చేసిన ఈ పనికి దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. ఇలాంటి తరుణంలో సోషల్ మీడియాలో నెటిజన్లు చైనా ఉత్పత్తులు దేశంలో ఎవరూ కొనకూడదని ‘బ్యాన్ చైనా’ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కేంద్ర ఎలక్ట్రానిక్ అండ్ ఐటీ శాఖ దేశంలో ఉన్న పరిస్థితులు మరియు దేశ సమగ్రత రక్షణ దృష్ట్యా చైనా దేశానికి చెందిన 59 యాప్ లను నిషేధించడం జరిగింది. దీనిలో టిక్ టాక్ కూడా ఉంది.
వాస్తవానికి టిక్ టాక్ యాప్ కి చాలా మంది భారతీయులు అలవాటు పడటం జరిగింది. ఉన్న టాలెంట్ అతి తక్కువ టైమ్ లో చూపిస్తూ చాలామంది టిక్ టాక్ యాప్ వాళ్ళ ఎలా పాపులర్ అయ్యారో.. అదేవిధంగా కొంతమంది ప్రాణాలు కూడా ఈ యాప్ వల్ల కోల్పోవడం జరిగింది. అంతగా దేశంలో ఆదరణ దక్కించుకున్న టిక్ టాక్ యాప్ ని కేంద్రం నిషేధించడంతో, చాలామంది దేశంలో ఉన్న ప్రజలు నిరుత్సాహం చెందుతున్నారు. ఇలాంటి తరుణంలో త్వరలోనే ‘టిక్ టాక్’ మాదిరిగా ‘యూట్యూబ్ షార్ట్’ యాప్ అనే యాప్ అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఈ యాప్ లో 15 సెకన్ల వీడియోని చేసుకోవచ్చని టిక్ టాక్ కంటే మెరుగైన ఫీచర్లతో గూగుల్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ఈ వార్త తెలుసుకుని టిక్ టాక్ కి అలవాటు పడిన చాలామంది హ్యాపీ గా ఫీల్ అవుతున్నారు.