తెలంగాణలోని కీసర భూకుంభకోణం కేసులలో నిందితులు వరుసబెట్టి ఆత్మహత్యలు చేసుకుంటుండటం సంచలనం రేపుతోంది.ఈ కేసులలో ఇప్పటికే తహసీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకోగా తాజాగా మరో ప్రధాన నిందితుడు ధర్మారెడ్డి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
వీరు కేసులకు భయపడి ప్రాణాలు తీసుకున్నారా? లేక ఎవరైనా వీరిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.వివరాల్లోకి వెళితే ఒక రియల్ ఎస్టేట్ సంస్థకు అనుకూలంగా భూరికార్డులు మార్చేందుకు రూ.2 కోట్లు లంచం అడిగి, ముందస్తుగా రూ.1.10 కోట్లు తీసుకుంటూ ఆగస్టు 14న తహసీల్దార్ నాగరాజుతోపాటు రియల్టర్లు అంజిరెడ్డి, శ్రీనాథ్యాదవ్, వీఆర్ఏ సాయిరాజు ఏసీబీకి పట్టుబడ్డారు. నాగరాజుని ఏసీబీ అధికారులు విచారించే క్రమంలో ధర్మారెడ్డితో కలిసి ఇదే తాసిల్దార్ చేసిన మరో పెద్ద భూ కుంభకోణం బయటపడింది.నాగరాజు ఆ గ్రామ భూస్వామి కందాడి ధర్మారెడ్డి,అతని కుమారుడు శ్రీకాంత్రెడ్డితో కలిసి నకిలీ పత్రాలు, అక్రమ పాస్ పుస్తకాలు సృష్టించినట్టు గుర్తించిన ఏసీబీ రెండో కేసును నమోదు చేసింది.ఈ కేసులో ధర్మారెడ్డి, శ్రీకాంత్రెడ్డి, ఇద్దరు రియల్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్ లను సెప్టెంబర్లో అరెస్టు చేశారు.
ఈ క్రమంలోనే అక్టోబర్ 14న తహసీల్దార్ నాగరాజు చంచల్గూడ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు.కాగా మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డికి వయసు దృష్ట్యా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.అతని కుమారుడు శ్రీకాంత్రెడ్డి, మిగిలిన నిందితులంతా జైలులోనే ఉన్నారు. తాజాగా రెండు రోజుల క్రితం ధర్మారెడ్డి సైతం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.తహసీల్దార్ నాగరాజు ఏసీబీ కస్టడీలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ ఈ కేసు విచారణ నిలిచిపోదని యథావిధిగా దర్యాప్తు సాగుతుందని ఏసీబీ అధికారులు అప్పట్లో చెప్పారు.అయితే ఇంతలోనే అదే కేసులో మరో ప్రధాన నిందితుడు కందాడి ధర్మారెడ్డి ఆత్మహత్య చేసుకోవటం గమనార్హం. చెప్పారు.
దీంతో ఈ కేసులో ఏసీబీ ఎలా ముందుకు సాగుతుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. అదే సమయంలో తాశీల్దార్గార్ని ధర్మారెడ్డి కానీ నిజంగానే ఆత్మహత్య చేసుకున్నారా లేక పోతే వెనకనుండి ఎవరైనా ప్రేరేపించి ఆత్మహత్య చేసుకొనేలా చేశారా అన్నది కూడా ఇప్పుడు కలుగుతున్న అనుమానం.కేసు నేపథ్యాన్ని చూస్తే ఇది ఒక తాసిల్దారు ఒక భూస్వామి స్థాయిలో చేసేదిగా లేదు.తప్పనిసరిగా ఈ భారీ భూకుంభకోణం వెనుక పెద్ద హస్తాలే ఉంటాయని భావిస్తున్నారు.విచారణ సందర్భంగా ఆ పెద్ద తలకాయలు తమ పేరు బయటికి రాకుండా ఉండడం కోసం వీరిని ప్రేరేపించి ఆత్మహత్య చేసుకునేలా చేస్తూ ఉన్నాయా అని ఏసీబీ అధికారులు సైతం ఆలోచనలో పడ్డారు. కూపీలాగేందుకు వీరి ములాఖత్, ఫోన్ రికార్డ్స్పై ఏసీబీ ఆరా తీస్తోందని తెలిసింది. మొత్తం మీద కీసర ఆత్మహత్యలు ఆ ప్రాంతంలో హాట్ టాపిక్ గా మారాయి.