ఆంధ్రప్రదేశ్ విద్యా విధానంలో సంచలన మార్పులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. గతంలోనే దశల వారీగా ఇంగ్లీష్ మీడియం బోధనను ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులోకి తెచ్చే విధంగా మార్పులు చేసిన జగన్ ఇప్పుడు ప్రీ ప్రైమరీ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు తెలిపారు.
వచ్చే ఏడాది నుండి ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేయనున్నారు. ఇప్పటివరకూ ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకూ విద్య అందుబాటులో ఉండేది. ఇకపై ఎల్కేజీ, యూకేజీలు కూడా ఉండనున్నాయి. ఈ ప్రీ ప్రైమరీ తరగతులను పీపీ1, పీపీ2లుగా పరిగణిస్తారు. దీనికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ పై ఇప్పటికే అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు.