ఏపీలో మళ్లీ ఎన్నికల నగారా మోగడం ఖాయం అనిపిస్తోంది. త్వరలోనే ఎన్నికలు జరగనున్నట్టు ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. మూడు ఫేజ్ లలో ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు నిర్వహించడం కోసం ఏపీ ఎన్నికల కమిషన్ సంసిద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది.
దీనికి సంబంధించి.. పూర్తి విధివిధానాలను రూపొందించే పనిలో ఏపీ ప్రధాన ఎన్నికల కమిషనర్ పడినట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన సిద్ధంగానే ఉన్నారట. త్వరలోనే దీనికి సంబంధించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ప్రెస్ మీట్ నిర్వహించే అవకాశం ఉంది.
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… మున్సిపల్ ఎన్నికల కోసం.. ఈనెల 11 నుంచి 13 వరకు నామినేషన్స్ నిర్వహిస్తారు. 23 న పోలింగ్ ఉంటుంది. 27న కౌంటింగ్ ఉంటుందని తెలుస్తోంది.
అలాగ గ్రామ పంచాయతీలకు కూడా రెండు ఫేజుల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17 నుంచి 19 వరకు మొదటి ఫేజ్ కు నామినేషన్లు నిర్వహించనుండగా… రెండో ఫేజ్ లో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు నామినేషన్స్, 29 న పోలింగ్, కౌంటింగ్ ఉండనున్నాయి.
మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికలను ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం ఒక విడతగా… మున్సిపల్ ఎన్నికలకు మరో విడతగా.. పంచాయతీ ఎన్నికలకు రెండు విడతలుగా నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతోంది.
అయితే.. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. సోషల్ మీడియలో ఈ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. చూద్దాం.. ఎన్నికల కమిషన్ దీనిపై ఏవిధంగా స్పందిస్తుందో?