ప్రస్తుతం దేశంలో స్వైరవిహారం చేస్తున్న మిడతల గుంపు అనుకున్నట్టుగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రం లోకి ప్రవేశించింది. గత కొద్ది రోజులుగా భారతదేశం లోని చాలా రాష్ట్రాలలో ఒక మిడతల గుంపు పంట పొలాలు అన్నింటిని నాశనం చేస్తూ వీరవిహారం చేస్తున్న విషయం తెలిసిన ఇప్పటికే ఉత్తరాన ఉన్న రాష్ట్రాలన్నీ దీని ధాటికి భారీగా పంట నష్టం చవిచూశాయి.
ఇక ఇప్పుడు తెలంగాణలో భూపాలపల్లి జిల్లా, పెద్దంపేట మరియు గోదావరి బెల్టు ప్రాంతాల్లో ఈ మిడతల గుంపు చాలా ఎకరాల పంట నష్టం చేసినట్లుగా స్థానికులు వెల్లడించారు. ఇదిలా ఉండగా మరొక రోజులో అవి ఎక్కడికి వెళ్లి ఏయే పంటల పై దాడి చేస్తాయా అని రైతులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.
ఇకపోతే రానున్న 24 గంటల్లో ఈ గుంపు ఆంధ్రకు కూడా తరలి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతంలోని గోదావరి జిల్లాలో ఉన్న పంట పొలాలన్నీ రూపు మారిపోయే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నివారణ చర్యలు మరియు అవగాహన కార్యక్రమాలు ఏమైనా ముందు జాగ్రత్త పడి చేపడుతుందో లేదో వేచి చూడాలి.