ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రెండవ దశ ఎన్నికల్లో భాగంగా దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో ఉన్న 95 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరిగింది. ఉదయం ఏడు గంటల నుండిసాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ ప్రక్రియ కొనసాగించారు. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో గంట ముందుగా నిలుపుదల చేశారు.
రెండో దశలో మొత్తం 1,611 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వాస్తవానికి రెండో దశలో భాగంగా 97 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. తమిళనాడులోని వేలూరు నియోజకవర్గం ఎన్నిక రద్దవడం, త్రిపురలోని త్రిపుర-తూర్పు లోక్సభ స్థానం ఎన్నిక మూడో దశకు (ఏప్రిల్-23కు) వాయిదా పడడంతో రెండు స్థానాలు తగ్గాయి.
కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 10, ఉత్తర్ప్రదేశ్లో ఎనిమిది, అసోం, బిహార్, ఒడిశాల్లో ఐదు సీట్ల చొప్పున, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లలో మూడు సీట్ల చొప్పున, జమ్మూకశ్మీర్లో రెండు సీట్లు, మణిపూర్, పుదుచ్చేరిల్లో ఒక్కో సీటుకు పోలింగ్ జరిగింది.
ఈ ఎన్నికల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 61.12 శాతం ఓటింగ్ నమోదయ్యింది.
రాష్ట్రాల వారీగా పోలింగ్ శాతం:
- అస్సాం 73.32 శాతం
- బీహార్ 58.14 శాతం
- ఛత్తీస్ఘడ్ 68.70 శాతం
- జమ్మూ కశ్మీర్ 43.37 శాతం
- కర్ణాటక 61.80 శాతం
- మహారాష్ట్ర 55.37 శాతం
- మణిపూర్ 74.69 శాతం
- బెంగాల్ 75.27 శాతం
- ఒడిశా 57.41 శాతం
- పుదుచ్చేరి 72.40 శాతం
- తమిళనాడు 61.50 శాతం
- ఉత్తర ప్రదేశ్ 58.12 శాతం