Lokesh : లోకేష్ Lokesh త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడం కోసం అధికార పార్టీ వైసిపి ప్రతిపక్ష పార్టీ టిడిపి నువ్వానేనా అన్నట్టుగా ఎత్తులు పై ఎత్తులు వేస్తూ ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలలో చాలావరకు పట్టు కోల్పోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో రాణించాలని టిడిపి తీవ్ర స్థాయిలో కృషి చేస్తూ ఉంది. ఇలాంటి తరుణంలో టిడిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అధికార పార్టీ వైసీపీపై తీవ్రస్థాయిలో సోషల్ మీడియాలో మండిపడ్డారు.
లోకేష్ ట్విట్టర్ లో ఈ రీతిలో స్పందించారు.. “ తిరుపతి మున్సిపాలిటీ పరిధిలో 45 వ వార్డు కోసం టిడిపి పార్టీ తరపున నామినేషన్ వేసిన అభ్యర్థి చంద్రమోహన్ నీ బలపరిచేందుకు టిడిపి నాయకుడు గొల్ల లోకేష్ నాయుడు పై వైసీపీ రౌడీలు దాడులకు పాల్పడ్డారని, ఆయన దుకాణాన్ని ధ్వంసం చేశారని లోకేష్ ఆరోపించారు. అంతేకాకుండా ఆ వీడియోలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తీవ్రస్థాయిలో కామెంట్ చేశారు. ఇంకా మాట్లాడుతూ..వైసీపీ దద్దమ్మల్లారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తూ ఎన్నికల్లో నిలబడి పోటీ చేసే దమ్ము లేని మీరు ఈ బాగోతాలు బయట పడతాయి అనే కదా, చంద్రబాబు గారికి భయపడి ఆయన్ను విమానాశ్రయం లో అడ్డుకున్నది అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.ఇలాంటి దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది అని సూటిగా ప్రశ్నించారు.