Lokesh : చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ రంగంలో అడుగుపెట్టిన నారా లోకేష్…తండ్రికి తగ్గ రాజకీయ చాణిక్యత చూపించలేకపోయారు. టిడిపి పార్టీ ఎమ్మెల్సీగా పార్టీ తరఫున రంగంలోకి దిగిన లోకేష్ ఏమాత్రం అనుభవం లేకుండానే మొదటిలో చంద్రబాబు హయాంలో మంత్రి పదవులను అందుకని..చాలా సందర్భాలలో ప్రజల మధ్య అదే విధంగా మీడియా ముందు మాట్లాడటం లో నవ్వులపాలైన సందర్భాలు ఉన్నాయి. ఆ రీతిగానే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పొలిటికల్ గా రాణించిన లోకేష్ 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో పోటీకి దిగి ఓడిపోవడంతో, ఇక లోకేష్ రాజకీయాలకు పనికి రాడు అనే టాక్ సొంత పార్టీ నేతల నుండి అప్పట్లో రావడం జరిగింది.
అయితే తర్వాత రాను రాను క్యాడర్ తో అదేవిధంగా పార్టీ ని ఇబ్బంది పెట్టిన తరుణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న కార్యకర్తలతో కలిసిపోతూ రాణిస్తున్న లోకేష్ ప్రస్తుతం ఓ మాదిరిగా నాయకుడిగా అనిపించుకుంటున్నారు. పార్టీకి సంబంధించిన నాయకుడు ఎవరైనా అరెస్టయిన ఎటువంటి ప్రమాదానికి గురైన వెంటనే పార్టీ తరఫున సదరు వ్యక్తి దగ్గరికి గాని కుటుంబం దగ్గర గాని వెళ్లి మరి పరామర్శించి ధైర్యం చెబుతున్నారు.
Lokesh : వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం ఆమరణ నిరాహార దీక్ష:
ఇటువంటి తరుణంలో లోకేష్ ని మరింతగా ప్రమోట్ చేయడం కోసం చంద్రబాబు సరికొత్త ఎత్తుగడ వేసినట్టు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో.. లోకేష్ చేత ఆమరణ నిరాహార దీక్ష చేయించడానికి చంద్రబాబు సరి కొత్త స్కెచ్ రెడీ చేసినట్లు వార్తలు అందుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిడిపి పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా చేయడంతో పాటు మరికొంతమంది నేతలు ముందుకు వస్తున్న తరుణంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఒకానొక సమయంలో టీడీపీకి మంచి పార్టీ ఉండటంతో 2019 ఎన్నికల్లో చాలావరకు నష్టపోవడంతో.. పెరిగే ఆ ప్రాంతం పై పట్టు రాబట్టడానికి చంద్రబాబు ఈసారి కొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం.