Lokesh: 2014లో టీడీపీ(TDP) అధికారంలో ఉన్న సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో లోకేష్(Lokesh) పార్టీ తరఫు ఎమ్మెల్సీ పదవి పొంది…పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కొడుకు కావడంతో లోకేష్(Lokesh) పొలిటికల్ ఎంట్రీపై రాజకీయంగా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అయితే అనతికాలంలోనే చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రి పదవి అందుకున్న లోకేష్..(Lokesh) చాలా సందర్భాలలో తన మాట్లాడే తీరును బట్టి.. ప్రత్యర్థులకు అలుసు అయ్యారు.
ఈ క్రమంలో 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ ఓడిపోవడం తెలిసిందే. దీంతో లోకేష్ టిడిపి పార్టీ భవిష్యత్తు అని అనుకున్న వాళ్లంతా ఆశలు అడియాశలయ్యాయి. అంత మాత్రమే కాక లోకేష్(Lokesh) వ్యవహారశైలి వల్ల కూడా పార్టీ ఎన్నికలలో ఓడిపోయినట్లు కూడా టిడిపికి చెందిన వాళ్లే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కడ నుండి పోటీ చేస్తారు అన్న దాన్ని.. ఈ విషయంలో గత కొంత కాలం నుండి ఏపీ రాజకీయాల్లో రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
నెక్స్ట్ చంద్రబాబే సీఎం …
ఇటువంటి తరుణంలో ప్రస్తుతం చంద్రబాబు(Chandrababu) చేపట్టిన 36 గంటల దీక్ష నేపథ్యంలో లోకేష్ అధికార పార్టీ వైసీపీ పై తీవ్రస్థాయిలో మండిపడుతోంది వచ్చే సార్వత్రిక ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గం నుండి పోటీ చేసి తెలుగుదేశం పార్టీకి కానుకగా ఇస్తానని ప్రసంగించారు. కచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని పేర్కొన్నారు. అంతమాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై ఎటువంటి కేసులు పెట్టిన భయపడాల్సిన అవసరం లేదని… వచ్చేది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని.. లోకేష్ స్పష్టం చేశారు.