చంద్రబాబు తనయుడిగా టిడిపి వారసుడిగా రాజకీయాలలో అడుగుపెట్టిన లోకేష్ ప్రారంభంలో పార్టీ తరఫున ఎమ్మెల్సీ అయ్యారు. ఆ తర్వాత చంద్రబాబు క్యాడర్లో మంత్రి పదవిని సంపాదించి గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా చలామణి అయ్యారు. చంద్రబాబు కొడుకు కావడంతో లోకేష్ రాజకీయ వ్యవహారశైలిపై చాలామంది భారీ అంచనాలు పెట్టుకున్నారు.
కానీ లోకేష్ తండ్రి చంద్రబాబు మాదిరిగా రాజకీయాలు చేయడంలో విఫలం అయి, చాలా సందర్భాలలో అనగా ప్రజా సమస్య విషయంలో మాట్లాడే విధానంలో అదేవిధంగా మీడియా ముందు ప్రసంగించే సమయంలో నవ్వులపాలైన పరిస్థితి. ఇలాంటి 2019 ఎన్నికల్లో మొట్టమొదటిసారి ప్రజాక్షేత్రంలో మంగళగిరి నియోజకవర్గం తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన లోకేష్ కి మొదటి అడుగు లోనే ప్రజలు షాక్ ఇవ్వడం జరిగింది.
లోకేష్ వాటమి తో ఆయన పై సొంత పార్టీలోనే విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే పార్టీలో ఎలాగైనా రాణించాలని అనుకుంటున్నా లోకేష్ మామ బాలకృష్ణ సీటుపై కన్నేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. పూర్తి విషయంలోకి వెళితే టిడిపి పార్టీ స్థాపించిన నాటి నుండి హిందూపురం నియోజకవర్గం టిడిపి పార్టీకి కంచుకోటగా ఉంది. దీంతో మంగళగిరి నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసిన అదే సీన్ రిపీట్ అయ్యే పరిస్థితి ఉన్నట్లు వార్తలు రావడంతో హిందూపురం నియోజకవర్గం నుండి రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి లోకేష్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇప్పటికే బాలయ్యతో చర్చించడానికి రెడీ అవుతున్నట్లు కూడా టాక్.