విజయ్ మాస్టర్ సినిమా మీదే ఇప్పుడు కోలీవుడ్ మీడియా మొత్తం పెద్ద ఎత్తున చర్చలు జరుపుతోంది. అందుకు కారణం లాక్ డౌన్ తర్వాత భారీ స్థాయిలో థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది vijay మాస్టర్. ఈ సినిమా కి ఓటీటీ నుంచి భారీ మొత్తం లో ఆఫర్ వచ్చినా కూడా విజయ్ ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఇక ఈ సినిమా లాక్ డౌన్ ముందే రిలీజ్ కావాల్సి ఉండగా కుదరలేదు. అంతేకాదు ఈ సినిమా రిలీజ్ కి ముందే 200 కోట్ల బిజినెస్ అయిందట.
ఈ రకంగా చూస్తే vijay మాస్టర్ సినిమా మీద ఏ రకంగా అంచనాలున్నాయో అర్థమవుతోంది. ఇక విజయ్ గత కొంతకాలంగా వరసగా భారీ సక్సస్ లను అందుకుంటూ మంచి ఫాంలో ఉన్నాడు. ఇక దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ మీద కూడా కోలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పేరుంది. ముఖ్యంగా lokesh kanagraj రాక్ స్క్రీన్ ప్లే చాలా గ్రిప్పింగ్ గా ఉంటుంది. ఆ స్క్రీన్ ప్లే నే సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. ఇంతక ముందు lokesh kanagraj దర్శకత్వంలో వచ్చిన సందీప్ కిషన్ ‘మానగరం’ (నగరం) .. కార్తి ‘ఖైదీ’ సినిమాలు చూస్తే ఇదే విషయం అర్థమవుతుంది.
కోలీవుడ్ లో వచ్చిన ఈ రెండు సినిమాలు స్క్రీన్ ప్లే ప్రధానంగా తెరకెక్కిన కారణంగానే మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇప్పుడు కూడా ‘మాస్టర్’ సినిమాకి lokesh kanagraj సేం ఫార్ములాని కంటిన్యూ చేశాడు. ఈ స్క్రీన్ ప్లే మాస్టర్ సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని అందుకే మొదటి నుంచి చివరి వరకూ సినిమా ఉత్కంఠభరితంగా సాగుతుందని చెప్పుకుంటున్నారు. నిజంగా ఇదే జరిగితే vijay మాస్టర్ ఊహించని రేంజ్ లో హిట్ అందుకోవడం ఖాయమని విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల 13 న రిలీజ్ కాబోతోంది. ఇక ప్రస్తుతం lokesh kanagraj కమల్ హాసన్ తో విక్రం అన్న భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు.