వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అక్రమాలు అన్నిటిని వెలుగులోకి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అమరావతి భూముల కొనుగోలు విషయంలో జరిగిన అవినీతిని బయట పెట్టడానికి జగన్ సర్కారు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి.. జరిగిన అవినీతిని ఒక నివేదిక రూపంలో సీఐడి అధికారులకు ఇవ్వటం అందరికీ తెలిసిందే.
సీఐడి జరిపిన విచారణలో అమరావతి విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని, దీనిలో లోకేష్ అదే విధంగా చంద్రబాబు నాయుడు పాత్ర ఎంత ఉంది అనే ఆధారాలతో సహా వివరాలను హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. ఈ క్రమంలో న్యాయస్థానం ముందు భూములు కొనుగోలు విషయంలో చంద్రబాబు, లోకేష్ లకు సంబంధించి వాట్సాప్ సంభాషణల వివరాలను న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చినట్లు టాక్.
అమరావతి రాజధానిగా ప్రకటించక ముందే లోకేష్, చంద్రబాబు ఇద్దరూ తమకు అత్యంత సన్నిహితంగా ఉండే ఓ డాక్టర్ కి అదేవిధంగా మరొకరికి భూములను రాజధాని ప్రాంతంలో కొనుగోలు చేసే రీతిలో వెనక నుండి కథ నడిపించినట్లు వాటికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరాం సుబ్రహ్మణ్యం ఇటీవల నిర్ధారణ చేశారు. రాజధాని అమరావతి భూములను కొనుగోలు చేయడానికి అమెరికా నుండి కూడా పెద్ద ఎత్తున టిడిపి ఐ యాం లో నిధులు తప్పించినట్లు అనుమానం వ్యక్తం చేస్తూ వాటి విషయాలు పూర్తిగా బయటపడాలంటే లోతైన దర్యాప్తు చేయటానికి సిఐడికి ప్రత్యేక అనుమతులు ఇవ్వాలని కోరారు. మరోవైపు భూములు కొనుగోలు చేసిన వ్యక్తి లాయర్ మాట్లాడుతూ రాజధాని ప్రాంతం కి బయట భూములు కొంటే అది ఇన్సైడర్ ట్రేడింగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు.
అంతేకాకుండా రాజధాని ప్రాంతంలో భూములు కొంటే తప్పేంటి అని కూడా పేర్కొన్నారు. అయితే ఇరు వైపుల వాదనలు విన్న న్యాయమూర్తి.. చివరి లో మాట్లాడుతూ ప్రైవేటు భూముల కొనుగోలు అమ్మకాలు జరిగితే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమిటి అంటూ ప్రశ్నించడం జరిగింది. ఇదిలా ఉంటే రాజధాని ప్రకటించక ముందే ఆ ప్రాంతంలో భూములు కొనడం అనేది ఇన్ సైడ్ ట్రేడింగ్ అవుతుందని, అధికారం దుర్వినియోగం చేసినట్లు అని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఈ రాజధాని భూ కుంభకోణం లో చంద్రబాబు ని లోకేష్ ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అన్నట్టు అధికార పార్టీ నేతల వైఖరి ఉంది.