(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
భువనేశ్వర్: ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. ముంబయి నుంచి భువనేశ్వర్ వెళుతున్న లోక్మాన్య తిలక్ ఎక్స్ప్రెస్ రైలు సలాగావ్ సమీపంలో ఉదయం 7 గంటల సమయంలో ఓ గూడ్స్ రైలును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎల్టీటీ ఎక్స్ప్రెస్కు చెందిన ఏడు బోగీలు పట్టాలు తప్పాయి. 20 మందికి పైగా గాయపడ్దారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స కోసం కటక్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు, సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులను భువనేశ్వర్ చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు.
#UPDATE Chief Public Relation Officer (CPRO), East Coast Railway: 20 people injured after eight coaches of Lokmanya Tilak Express derail near Salagaon. No casualty reported till now. #Odisha https://t.co/JqaXdhzHTN
— ANI (@ANI) January 16, 2020