NewsOrbit
జాతీయం న్యూస్

కాంగ్రెస్ ఢిల్లీ మీటింగులో లొల్లి !అయినా అప్పర్ హ్యాండ్ సోనియాదే!

ఎట్టకేలకు కొత్త ప్రెసిడెంట్ ఎన్నికకు కాంగ్రెస్ రంగం సిద్ధం చేసింది. జూన్ నాటికి పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని, ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ప్లీనరీ సెషన్ ను నిర్వహించాలని నిర్ణయించింది.

పార్టీ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) మీటింగ్ శుక్రవారం వర్చువల్ గా జరిగింది. దాదాపు మూడున్నర గంటల సమావేశం తర్వాత కాంగ్రెస్ లీడర్లు కేసీ వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా మీడియాతో మాట్లాడారు. ఐదు రాష్ట్రాల(పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, కేరళ, పుదుచ్చేరి) అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలో అంతర్గత ఎన్నికలు నిర్వహించాలని మీటింగ్ లో నిర్ణయించామని ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ చెప్పారు. ఏదేమైనప్పటికీ జూన్ నాటికి కొత్త ప్రెసిడెంట్ ఎన్నికను పూర్తి చేయాలని సీడబ్ల్యూసీ నిర్ణయించిందని తెలిపారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను బట్టి, షెడ్యూల్ లో కొంత మేరకు మార్పులు ఉండొచ్చని పేర్కొన్నారు. ‘‘మే చివరలో ప్రెసిడెంట్ ఎన్నిక నిర్వహించాలని ఎలక్షన్ కమిటీ ప్రతిపాదించింది. అయితే అసెంబ్లీ ఎన్నికల టైమ్ లో పార్టీలో ఇంటర్నల్ ఎలక్షన్లు నిర్వహించొద్దని సీడబ్ల్యూసీ మెంబర్లు సోనియాను కోరారు. జూన్ వరకు ప్రెసిడెంట్ ఎన్నికను పూర్తి చేయాలని, జూన్ చివరలో ఏఐసీసీ ప్లీనరీ సెషన్ ను నిర్వహించాలని విన్నవించారు” అని వేణుగోపాల్ వెల్లడించారు. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి మీటింగ్ లో ఎలాంటి గొడవ జరగలేదని రణదీప్ సూర్జేవాలా చెప్పారు. షెడ్యూల్ ను కొంచెం ముందుకు పొడిగించాలని సీనియర్ లీడర్లు సూచించారని పేర్కొన్నారు.

ముందే ఎన్నికలు పెట్టాలని రెబెల్స్ డిమాండ్

మీటింగ్ లో ముందుగా సోనియాగాంధీ మాట్లాడారు. ఆ తర్వాత కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రతిపాదించిన ఆర్గనైజేషనల్ ఎలక్షన్ షెడ్యూల్ ను కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ప్రెసిడెంట్ ఎన్నిక, ఏఐసీసీ సెషన్ ను మే 29న నిర్వహించాలని సెంట్రల్ ఎలక్షన్ అథారిటీ ప్రతిపాదించింది. ఈ సందర్భంగా లీడర్ల మధ్య గొడవ జరిగింది. పార్టీ ఎన్నికలను వెంటనే నిర్వహించాలని రెబెల్ గా మారిన సీనియర్ లీడర్లు గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, పి.చిదంబరం డిమాండ్ చేశారు. మరోవైపు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే పార్టీ ఎలక్షన్లు నిర్వహించాలని… గాంధీ ఫ్యామిలీకి విధేయులైన అశోక్ గెహ్లాట్, అమరీందర్ సింగ్, ఏకే ఆంటోని, తారీఖ్ అన్వర్, ఉమెన్ చాందీ కోరారు. ‘‘ఎవరి ఎజెండా మేరకు మనం పని చేస్తున్నాం? మన పార్టీ మాదిరి బీజేపీ ఇంటర్నల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడదు. ముందు అసెంబ్లీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఆ తర్వాతే ఆర్గనైజేషనల్ ఎలక్షన్లు” అని ఓ లీడర్ కామెంట్ చేశారు. ఇంటర్నల్ ఎన్నికల విషయాన్ని పార్టీ చీఫ్ సోనియాకు వదిలేసి, మోడీ సర్కార్ పై పోరాడే విషయంపై ఫోకస్ పెట్టాలని రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సూచించారు. చివరకు అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే పార్టీ ఎలక్షన్లు పెట్టాలని నిర్ణయించారు. ఎన్నికల తేదీలపై సోనియా గాంధీ తుది నిర్ణయం తీసుకుంటారని నేతలు ప్రకటించారు.

 

author avatar
Yandamuri

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju