కృష్ణా జిల్లా రాజకీయాలలో టిడిపి పార్టీ కీలక నేత బెజవాడ ఎంపీ కేశినేని నాని పొలిటికల్ కెరియర్ పై రాజకీయవర్గాలలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. టిడిపి పార్టీలో ఎలాంటి తప్పు జరిగినా నిలదీయ గలిగిన నేతగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ వ్యవహరించే ఎంపీ కేశినేని నాని తాజా పరిణామాలపై ఒంటరై పోయినట్లు తెలుస్తోంది. 2014 ఎన్నికలలో విజయవాడ ఎంపీగా గెలిచిన కేశినేని నాని తర్వాత జరిగిన ఎన్నికలలో కూడా తన స్థానాన్ని కాపాడుకుని మరోసారి గెలవడం జరిగింది.
2019 ఎన్నికల్లో టిడిపి పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది చెందటంతో కేశినేని నాని చాలా నిరుత్సాహం చెందినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా పార్టీ లో ముఖ్యంగా కృష్ణా జిల్లాలో కొంత మంది నాయకుల వల్లే టీడీపీ గ్రాఫ్ పడిపోయినట్లు చాలా సందర్భాలలో సోషల్ మీడియాలో తన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పుకొచ్చారు. సొంత జిల్లాలో అప్పట్లో మంత్రులుగా ఉన్న వారితో కూడా కేశినేని నానికి పడేది కాదు అనే టాక్ అప్పట్లో ఉండేది.
ఈ క్రమంలో కృష్ణాజిల్లాలో నాయకులు ఈ ఎంపీని ఏకాకి చేసినట్లు చంద్రబాబు కి లేనిపోని మాటలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఇటీవల పార్టీకి సంబంధించి ప్రకటించిన కొత్త కమిటీ పదవులలో కేశినేని నానికి ఎలాంటి పదవి చంద్రబాబు అప్పజెప్పలేదు అనే టాక్ వినబడుతుంది. ఏది ఏమైనా కృష్ణా జిల్లా రాజకీయాల్లో కీలక నాయకుడిగా టీడీపీ పార్టీలో రాణిస్తున్న ఎంపీ కేశినేని ప్రస్తుత పరిణామాలను బట్టి ఆయన ఒంటరి అయిపోయినట్లు ఏపీ రాజకీయవర్గాలలో వినబడుతున్న టాక్. చాలా వరకు ఎంపీ నాని దూకుడుగా మాట్లాడటం పార్టీ పైన ఇష్టానుసారంగా కామెంట్లు చేయడంతోనే ఈ పరిస్థితి ఆయనకు ఎదురైనట్లు విశ్లేషకులు అంటున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?