రుచికరమైన ఆహారం కోసం కొంత మంది భోజనప్రియులు హోటళ్ళుకు వెళ్తుంటారు.ఐతే అక్కడ లభించే ఆహార నాణ్యత గురించి ఎవ్వరు ఆలోచించటంలేదు.కమ్మటి రుచి, వాసనా రావడానికి మంచి పదార్ధాలు వాడుతున్నారో లేదో కూడా పటించుకోవడం లేదు. అసలే కరోనా వచ్చి జనాలు బయటికి రావడానికి కూడా ఇబ్బంది పడుతుంటే కొన్ని హోటల్ కి వచ్చిన భోజనప్రియులుకు మాత్రం వారు కల్తీ ఆహారాన్ని అందిస్తున్నారు.
ఇప్పుడు తాజాగా విజయవాడ లో వెలుగు చుసిన సంఘటన ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది.జిల్లా విజిలెన్స్ శాఖ, ఆహార భద్రత అధికారులు సంయుక్తంగా మంగళవారం విజయవాడ ఎంజి రోడ్ లోని లైఫ్ స్టైల్ భవనం లో ఉన్న బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో నిర్వహించిన తనిఖీలలో అనేక వాస్తవాలు వెలుగుచూశాయి. కుళ్లిపోయే స్థితిలో ఉన్న మటన్. రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉన్న ఆహార పదార్థాలు, హానికర రసాయనాల వాడకం ఇలా అడుగడుగునా నిబంధనలు ఉల్లంఘిస్తూ వినియోగదారుల ఆకలిని సొమ్ము చేసుకుంటున్నారు. విజిలెన్స్ ఎస్పి కనకరాజ్ నేతృత్వంలో జరిగిన ఆకస్మిక దాడుల్లో పలు ఆసక్తికర విషయాలను గుర్తించారు.
ఫ్రిజ్ తో పాటు వంటగది స్టోర్ రూమ్ లను పరిశీలించారు. ఫ్రిజ్ లో నిల్వ ఉంచిన మటన్ గడ్డకట్టుకుపోయి కుళ్లిపోయే స్థితిలో ఉంది. దీనిని తింటే ప్రజలు అనారోగ్యం పాలవుతారు. హాని కలిగించేఆహారం పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపినట్లు తెలిపారు. ప్రయోగశాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతానికి నిబంధనలు ఉల్లంఘించి నందుకు నోటీసులు జారీ చేశారు.అలాగే ఫ్రిడ్జ్ లో దాదాపు 15 రోజుల క్రితం నుంచి నిల్వ ఉంచినా 150 కిలోల మటన్ ను గుర్తించారు. అది కూళ్లిపోయే స్థితిలో ఉంది. గడువు ముగిసిన ఇరవై పలావు ప్యాకెట్లు ఫంగస్ ఉండటాన్ని గమనించారు. వీరు వండిన అన్నాన్ని సైతం ఫ్రిజ్ లో ఉంచుతున్నారు. బిర్యానీ తయారీ లో సింథటిక్ రంగులను వినియోగిస్తున్నారని అనుమానంతో నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా సిబ్బంది ఎవరూ కూడా శానిటేషన్ చేయకుండానే ఒక్కో టేబుల్ పై 8 నుంచి10మంది వరకు కూర్చోబెడతన్నారు. అనుమతి లేకుండా కుల్ఫీ, ఐస్ క్రీమ్, బేకరీ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.ఇప్పటికిని భోజనప్రియులు వీటిని గమనించి తినుబండారాల విషయంలో జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.రుచి కరమైన ఆహార పదార్ధాల కోసం రెస్టారెంటులకు వెళ్తే కొత్త జబ్బులు రావటం ఖాయం.