గతేడాది చివరిలో వెలుగు చూసిన కరోనా వైరస్ (కోవిడ్-19) ఇప్పటికే ప్రపంచంలోని అన్ని దేశాలకు విస్తరించి.. తన ప్రభావాన్ని పెంచుకుంటూనే ఉంది. ఇప్పటికే ఆర్థిక, ఆరోగ్య సంక్షోభాన్ని సృష్టించిన కరోనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగా 13 లక్షలకు పైగా మంది ప్రజల ప్రాణాలను బలి తీసుకుంది. ఆరు కోట్ల మందికి పైగా ప్రజలను అనారోగ్యానికి గురిచేసింది. ఇంకా తన ప్రభావాన్ని పెంచుకుంటున్న కరోనా వైరస్.. వికృత రూపం దాలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే కోవిడ్-19తో పాటు, వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు ముమ్మరం చేశారు సైంటిస్టులు. దానిలో భాగంగా వారు నిర్వహించిన పరిశోధనలో ఇప్పటికే పలు ఆసక్తికర, ఆందోళనకర విషయాలు వెలుగుచూశాయి. తాజాగా పలువురు సైంటిస్టుల జరిపిన తమ అధ్యయనంలో కరోనా లక్షణాలను మరింత విస్తృతంగా వివరించారు. ఇప్పటికే జ్వరం, అగకుండా దగ్గు రావడం, చలిగా ఉండటం, తరచూ వణికడం, ఒళ్లు నొప్పులు వంటివి కరోనా లక్షణాలుగా వైద్యులు వెల్లడించారు.
అయితే, “మెడంటా కోవిడ్–19” పేరుతో నిర్వహించిన ఓ అధ్యయనం.. రుచిని కోల్పోవడం, వాసను గుర్తించకపోవడం కూడా కరోనా లక్షణాలేనని తెలిపింది. అలాగే, గ్యాస్ట్రిక్ ట్రబుల్ కూడా కరోనా సోకిందనడానికి రుజువు అని ఈ అధ్యయనం విరించింది. ఈ పరిశోధనకు నోయిడాకు చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అరుణ్ లఖన్పాల్ నాయకత్వం వహించారు. ఆయన ఈ అధ్యయన వివరాలను వెల్లడిస్తూ.. వాసన, రుచిలను గుర్తించకపోవడం (కోల్పోవడం) కూడా కరోనా లక్షణాలే అని అన్నారు.
ఈ లక్షణాలు కరోనా ఎటాక్ చేసిన రెండో వారంలో కనిపిస్తాయని అరుణ్ తెలిపారు. భారత వైద్య నిపుణులు సైతం ఈ విషయాన్ని స్పష్టం చేశారు. 40 శాతం పేషేంట్లలో ఇది వంద శాతం నిజమవుతోందని తెలిపారు. అయితే, వాసన, రుచిని గ్రహించే శక్తి తిరిగి రావడానికి మూడు నుంచి నాలుగు వారాల సమయం పడుతుందని వెల్లడించారు. అయితే, ఎక్కువ శాతం వాసన, రుచి కోల్పోతున్న వారిలో యువతే ఉన్నారనీ, ఎక్కువ ప్రమాదం లేకపోవడంతో వీరికి ఆక్సిజన్ సపోర్టు అవసరం లేదని అన్నారు. అయితే, బయట తిరగకుండా స్వీయనిర్భంధంలో ఉండటం మంచిదని సూచించారు.