మోసగాళ్లు డబ్బు సంపాదించటానికి వైరస్ గురించి ఫేక్ న్యూస్ ను ఉపయోగించుకోవటం, ఫిబ్రవరి లోనే మొదలైయింది .
కరోనా సంక్షోభం లో ఎలాంటి పుకార్లను పుట్టించొద్దని ప్రభుత్వం మొత్తుకున్నా, సోషల్ మీడియాలో సైన్టిస్ట్ లు ప్రయోగాలు చేస్తున్న ఉన్నారు . . తమ పైశాచిక ఆనందం కోసం తాజాగా శానిటైజర్ను ఎంచుకున్నారు . కరోనా వైరస్ ఎక్కువగా ఉండటం తో అందరు శానిటైజర్ర్లను వాడుతున్నారు.బయటకు వెళ్లి వచ్చినా , ఏమైనా వస్తువులు తాకినా, ప్రయాణాలు చేసినా, చేతులను వెంటనే శానిటైజర్ తో శుభ్రం చేసుకుంటున్నాం.అయితే, శానిటైజర్ అతిగా వాడితే చర్మ వ్యాధుల ముప్పు ఉందని, క్యాన్సర్ కూడా రావొచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.ఆ ప్రచారంలో నిజమెంతా?ఇప్పుడు చూద్దాం.హిందీ న్యూస్ పేపర్ క్లిపింగ్ తరహాలో ఉన్న ఆ ఫేక్ వార్తను కొందరు సోషల్ మీడియా లోపోస్ట్ చేసారు. 50 నుంచి60 రోజులు శానిటైజర్ వాడితే క్యాన్సర్ , చర్మ వ్యాధులు వస్తాయని ఆ పోస్ట్ సారాంశం. దీంతో ప్రజలు దాన్ని వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తూ.. ఒకర్నొకరు బయపెట్టుకుంటున్నారు . శానిటైజర్ వాడొద్దని , సబ్బులే సురక్షితమని ప్రచారం చేస్తున్నారు . ఓ ట్విట్టర్ యూజర్ ఆ న్యూస్ క్లిప్ ను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కి పోస్ట్ చేసాడు.దీనిపై స్పందించిన PIB అది ఫేక్ న్యూస్ అని నిరంతరం హ్యాండ్ వాష్ కోసం శానిటైజర్ వాడితే క్యాన్సర్ రాదని స్పష్టం చేసింది . ప్రజలు దీనిపై ఆందోళన చెందవద్దని పేర్కొంది . 70 శాతం ఆల్కహాలు ఉన్న శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకోవడం వల్ల కొరోనా సోకదని ,సోషల్ మీడియా లో వచ్చే అవాస్తవాలను నమ్మొద్దని ,బయాలు వీడి నిశ్చింతగా శానిటైజర్ వాడవచ్చని తెలిపింది .