ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు అందులో అస్త్రాల ప్రాస్థవనే తప్ప నైతికత ప్రస్థావన అనేదే రాదు! బరిలోకి దిగాక మాటలు ఎక్కువగా వస్తున్నాయంటే… అస్త్రాల సంఖ్య తక్కువగా ఉన్నాయని అయినా అనుకోవాలి లేదా ఉన్న అస్త్రాలు అయిపోయాయనైనా భావించాలి. ఇంతకూ ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే… అమరావతి విషయంలో ఆల్ మోస్ట్ అధికార – ప్రతిపక్షాల మధ్య భారీ యుద్దమే జరుగుతుంది. ఎవరి స్థాయిలో వారి వారి అస్త్రాలను ఈ విషయంలో ప్రయోగిస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా దినకరన్… “నైతికత” అనే అస్త్రాన్ని ప్రయోగించారు!
నవ్యాంధ్ర రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుకు సంబంధించిన బిల్లులు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరిన క్రమంలో… ఈ బిల్లులను ఆయనకు ఆయనే ఆమోదించేస్తార..? లేక రాష్ట్రపతి వరకూ పంపుతారా అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి తరుణంలో ఆ బిల్లులను ఆమోదించొద్దని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు లేఖలతో ఏకంగా గవర్నరే డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. బీజేపీ నేత లంకా దినకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు.
“బీజేపీది ఒకటే మాట… అమరావతి కార్యనిర్వాహక రాజధాని. బీజేపీ కేంద్ర పార్టీ, రాష్ట్ర పార్టీ అని రెండు పార్టీలు ఉండవు. భారతదేశం మెత్తం ఒక్కటే భారతీయ జనతాపార్టీ. గవర్నర్ గారికి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు కన్నా లక్ష్మీ నారాయణ గారు రాసిన లేఖలో పార్టీ విధానం స్పష్టంగా ఉంది. అమరావతిపై సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి నైతికత ముఖ్యం” అని లంకా దినకర్ ట్వీట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే… అస్త్రాలు అయిపోయినట్లున్నయనే కామెంట్లు వినిపిస్తున్నాయి!
ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే… 29 గ్రామల రైతులకు అన్యాయం జరగనివ్వమని జగన్ చెబుతున్నా వినని బీజేపీ నేతలు… ఆ 29గ్రామాల రైతుల, రియల్ ఎస్టేట్ వ్యాపారుల గురించి ఆలోచిస్తూనే “నైతికత” ప్రస్థావన తీసుకొస్తుంటే… 13జిల్లాల ప్రజల తరుపున ఆలోచించడంలో వారి “నైతికత” ఏమైనట్లనే ప్రశ్నను ఎదుర్కొంటున్నారు!!