ఎవరు ఎన్ని చెప్పినా.. ఎవరు ఏమి చేసినా.. ధర్నాలు, దీక్షలు అంటూ శతదినోత్సవాలు, ద్విశతదినోత్సవాలు చేసినా… అమరావతిలోనే పూర్తి రాజధాని ఉండదన్న క్లారిటీ ఎప్పుడో ఇచ్చేశారు ఏపీ ముఖ్యమంత్రి. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు గ్రహించలేకపోతున్నాయా.. లేక ఇప్పటికే గ్రహించేసే హడావిడి చేస్తున్నాయ అనేది వారికే తెలియాలి. ఆ సంగతులు అలా ఉంటే… అమరావతిలోనే ఏపీ పూర్తి రాజధాని ఉండదు అన్న విషయాన్ని స్పష్టం చేసి.. దానికి రాజకీయంగా ఉన్న అన్ని అడ్డంకులనూ, సామాజికంగా ఉన్న అన్ని విమర్శలనూ ఒక్కొక్కటిగా తొలగించుకుంటూ విశాఖ ప్రయాణం సాగిస్తున్నారు వైఎస్ జగన్.
ఐదేళ్లు తాత్సారం చేసి బాబు చేసిన తప్పో.. అక్కడున్న వేల ఎకరాల్లో కొన్ని వందల ఎకరాలు కేవలం వారి అనుచరులు, శ్రేయోభిలాషులే కొన్న తర్వాత అమరావతిని అక్కడ ప్రకటించడమో.. కారణం ఏదైనా కావొచ్చు.. కానీ అమరావతి నిజంగానే గ్రాఫిక్స్ కి పరిమితమైపోబోతోంది. అక్కడ కేవలం జగన్ ప్రాక్టికల్ గా చూపించబోయే శాసన రాజధాని మాత్రమే ఉండబోతుంది తప్ప.. గ్రాఫిక్స్ లో చూసిన, చూపిన రాజధాని కాదు! స్పష్టం!!
ఇప్పటికే టీడీపీ ఆధ్వర్యంలోనో, టీడీపీ మద్దతుతోనో.. అమరావతి లో ఆందోళన చేస్తున్న రైతులను పిలిపించి, మాట్లాడాలని వైఎస్ జగన్ ఫిక్సయ్యారని తెలుస్తుంది. అక్కడికే ఒక స్టెప్ పడిపోయినట్లే! ఇక ఏపీ డీజీపీ సైతం విశాఖ వెళ్లి డీజీపీ ఆఫీసుకు, పోలీస్ అకాడమీకి మొదలైన ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలను చెక్ చేసుకోవడంలో బిజీ అయిపోయారు. జగన్ ఎప్పుడంటే అప్పుడు తరలించడానికి తమ డిపార్ట్ మెంట్ రెడీగా ఉందని చెప్పారు. స్పష్టం!!
తాజాగా విజయవాడలోని స్వరాజ్ మైదానంలో 125 అడుగులు ఎత్తున అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడానికి రంగం సిధ్ధం చేయడంతో… అమరావతిలో బాబు నిర్మించ తలపెట్టిన ఆ కార్యక్రమం లేనట్లే! సో… దళితులవైపు నుంచి ఎలాంటి విమర్శలూ రాకుండా.. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా బాబు ఉద్దేశ్యాన్ని కూడా తనదైన కార్యక్రమంగా, చాకచక్యంగా నెరవేర్చేశారు జగన్! ఫలితంగా ఇకపైన కూడా విజయవాడ మాత్రమే మహానగరం తప్ప.. దాని పెరుగుదల అమరావతి వరకూ ఉండదని తేల్చేశారు! సుస్పష్టం!!
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?