ఫైజర్ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ అన్ని టేస్ట్ లను పాస్ అయ్యినందున ప్రజలకు అందించాలని బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించుకుంది. అయితే ఎలా అయినా కరోనా నుంచి తమని తాము రక్షించుకోవాలని ఇండియాలోని బడాబాబులు లండన్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవాలన్న ఆలోచనలో పడ్డారు. కావున వీరు ట్రావెల్ ఏజన్సీలను సంప్రదిస్తూ, లండన్ కు వెళ్లేందుకు తమవంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
బ్రిటన్ లో తొలి దశలో వయో వృద్ధులకు, హెల్త్ వర్కర్లకు మాత్రమే వ్యాక్సిన్ ఇస్తారని అక్కడి అధికారులు ముందుగానే స్పష్టం చేశారు. కానీ ఎలాగైనా వెళ్లి వ్యాక్సిన్ తీసుకుని వచ్చేద్దామని భావిస్తున్న కోటీశ్వరుల సంఖ్య అధికంగా ఉన్నట్టు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తెలుస్తోంది.
నిజానికి లండన్ ప్రయాణాలకు ఇది సరైన సీజన్ కాదు. అయినప్పటికీ బుధవారం వచ్చిన ప్రకటనతో యూకే వీసాలు కలిగివున్న వారు, లండన్ కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకుని రావాలని భావిస్తున్న మాట వాస్తవమేనని వారు అంటున్నారు. బ్రిటన్ ప్రభుత్వం నుంచి స్పష్టత కోసం మేము ఎదురు చూస్తున్నామని ట్రావెల్ ఏజెన్సీస్ అంటున్నాయి..