NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలుగు రాష్ట్రాల రాజ్ భవన్ లలో నేటి ‘ఎట్ హోమ్’ కార్యక్రమాలపై సర్వత్రా ఆసక్తి.. ఎందుకంటే..?

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లలో నేటి సాయంత్రం ‘ఎట్ హోమ్’ కార్యక్రమంలో భాగంగా తేనీటి విందు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి గానూ తెలంగాణ సీఎం తమిళి సై సౌందరరాజన్, ఇటు ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ లు ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. తెలంగాణలో గవర్నర్ తమిళిసై, సీఎం కేసిఆర్ లకు మధ్య బహిరంగ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో గవర్నర్ తమిళిసై ఆహ్వానంపై రాజ్ భవన్ లో జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి సీఎం కేసిఆర్ హజరు అవుతారా..?  లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ సీఎంఓ నుండి ఇప్పటి వరకూ ఎటువంటి క్లారిటీ రాలేదు. ముఖ్యమంత్రి కేసిఆర్ వైఖరిపై పలు మార్లు గవర్నర్ తమిళిసై బాహాటంగానే విమర్శలు చేయడం, దానిపై మంత్రులు రియాక్ట్ అవ్వడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేటి సాయంత్రం జరిగే ‘ఎట్ హోమ్’ కార్యక్రమం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతుంది.

ఇక ఏపి విషయంలోనూ సరికొత్త పరిణామం చోటుచేసుకోబోతున్నదా అన్న చర్చ జరుగుతోంది. ఈ రోజు సాయంత్రం ఏపి రాజ్ భవన్ లో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందింది. అయితే ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు కావాలంటూ ఏపి ప్రతిపక్ష నేత చంద్రబాబుకు కూడా ఆహ్వానం అందినట్లు తెలుస్తొంది. టీడీపీ విపక్షంలోకి వెళ్లిన తరువాత ఎట్ హోమ్ కార్యక్రమానికి ఆ పార్టీ నేతలు హజరుకావడం ఇదే ప్రధమం. తొలి సారిగా చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడుగా ఎట్ హోమ్ కార్యక్రమానికి హజరు అవుతుండటం, సీఎం వైఎస్ జగన్ తో ఒకే వేదిక పంచుకోబోతుండటం ఆసక్తికరంగా మారింది.

 

 

ఇటీవల ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సమావేశానికి ఏపి సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందగా, చంద్రబాబు మాత్రమే హజరైయ్యారు. సీఎం జగన్ ఈ సమావేశానికి డుమ్మా కొట్టి ఆ మరుసటి రోజు జరిగిన నీతి ఆయోగ్ కౌన్సిల్ సమావేశానికి హజరైయ్యారు. అయితే ఆ రోజు వైఎస్ జగన్ కు వ్యక్తిగత కార్యక్రమాలు ఉండటం వల్ల వెళ్లలేదని సమాచారం. ఇప్పుడు రాజ్ భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ .. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ఆహ్వానం పంపడం, ఆయన హజరు అవుతున్న నేపథ్యంలో సీఎం జగన్ హజరు అవుతారా లేదా, ఒకే వేదిక పంచుకుంటారా అన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాజ్ భవన్ లలో జరిగే ఎట్ హోమ్ కార్యక్రమాలపై రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి కొనసాగుతోంది. మరి కొద్ది గంటలపై దీనిపై సస్పెన్స్ వీడనుంది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju