LPG Price Hike: గ్యాస్ వినియోగదారులపై మరో సారి భారం పడింది. సామాన్యులకు మరో సారి షాక్ ఇస్తూ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఎల్పిజీ గ్యాస్ సిలెండర్ ధరలను పెంచాయి. అయితే ఈ సారి కాస్త ఊరట ఉంది. ఎందుకంటే ఇంతకు ముందు రెండు పర్యాయాలు గృహ వినియోగ (డొమెస్టిక్) గ్యాస్ సిలెండర్ పై రూ.50ల వంతున పెంచగా ఈ సారి సిలెండర్ పై కేవలం రూ.3.50లు మాత్రమే పెంచడం కొంత ఊరట. ఇప్పటికే పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదులతో పేద, మథ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నేటి నుండి డొమెస్టిక్ గ్యాస్ సిలెండర్ ధరపై రూ.3.50 లు పెంచగా కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధర పై రూ.8లు పెంచాయి. పెరిగిన ధరలతో ఈ రోజు నుండి ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలెండర్ ధర రూ.1003లు చేరుకుంది. ఇక ముంబాయిలో రూ.1002.50, కోల్కతాలో రూ.1029లు, చెన్నైలో రూ.1018.50లు, హైదరాబాద్ లో రూ.1055లు, విజయవాడలో 1,031లకు చేరింది. అనంతపురం జిల్లాలో ఏకంగా రూ.1070లకు చేరింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో సిలెండర్ ధర రూ.1100లకు చేరింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
LPG Price Hike: రెండు నెలల్లో మూడవ సారి
దేశంలో గుజరాత్ సహా అయిదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూ వస్తున్నాయి. గ్యాస్, పెట్రోల్ ధరలు పెరగడంతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎల్పీజీ గ్యాస్ ధరలు పెరగడం ఈ నెలలో రెండవ సారి. గత నెలలో గృహ వినియోగ ఎల్పీజీ సిలెండర్ పై రూ.50లు పెరిగిన నేపథ్యంలో పార్లమెంట్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశ వ్యాప్తంగా ధరల పెరుగుదలపై నిరసన వ్యక్తం చేశారు. ఈ నెల 7వ తేదీన డొమెస్టిక్ ఎల్ పీ జీ సిలెండర్ ధరలను రూ.50లు పెంచాయి. తాజా పెరుగుదలతో రెండు నెలల కాలంలో మూడవ సారి ధరలను పెంచాయి. అయితే ఇంతకు ముందు రెండు సార్లు రూ.50ల మేర పెంచిన కంపెనీలు ఈ సారి కేవలం రూ.3.50లు మాత్రమే భారం వేయడం కొంత ఊరట ఇచ్చే అంశంగా ఉంది.