MAA election: ప్రస్తుతం మా ఎలక్షన్ల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణుల మధ్య చాలా టఫ్ ఫైట్ నెలకొనడంతో ఎవరు గెలుస్తారనే దానిపై సర్వత్రా టెన్షన్లు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు మా ఎన్నికల పోలింగ్ కేంద్రంలో జరిగిన ఒక సంఘటన చర్చనీయాంశంగా మారింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఉదయాన్నే తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చిన విషయం తెలిసిందే. పవన్ అలా వచ్చి రాగానే మీడియా సిబ్బంది అతనికి అనేక ప్రశ్నలను సంధించారు.
Maa election: మా ఎలక్షన్లలో మహేష్ బాబు, జూ.ఎన్టీఆర్ ఎందుకు ఓటు వేయలేదో తెలుసా…?!
మోహన్ బాబుకే చిరంజీవి సపోర్ట్ చేస్తున్నారా లేక ప్రకాష్ రాజ్ కు మద్దతు ఇస్తున్నారా అన్నట్లు క్వశ్చన్స్ అడిగారు. దీనికి సమాధానంగా మోహన్ బాబు, చిరంజీవి మంచి స్నేహితులు అంటూ పవన్ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. రాజకీయ విభేదాలు స్నేహానికి అడ్డం రావని తేల్చి చెప్పారు. అనంతరం పవన్ కల్యాణ్ మా ఎలక్షన్ల ఆఫీస్ లోకి అడుగు పెట్టగానే మోహన్ బాబు ఆప్యాయంగా ఆహ్వానించారు. వీరు పోలింగ్ కేంద్రంలోనే భుజాలపై చేతులు వేసుకొని గుసగుసలాడారు.
Ganta Srinivasa Rao: ఒకే ఒక్క కండీషన్ తో జనసేనలోకి గంటా..!!
మోహన్బాబు పలికిన ఆ ఒకే ఒక్క మాట..!
రిపబ్లిక్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో పవన్ మోహన్ బాబు పేరు ప్రస్తావించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ వీరిద్దరూ నేరుగా పోలింగ్ కేంద్రంలోనే కలుసుకున్నారు. ఈ సందర్భంగా తొలిసారి పవన్ ని చూడగానే మోహన్ బాబు ఒకే ఒక్క మాట అన్నారట. ఏపీలో సినిమాల సమస్యల గురించి తర్వాత ఆలోచించవచ్చు. ప్రస్తుతానికి విష్ణుకి ఓటు వేసి గెలిపించవలసినదిగా పవన్ ని కోరారట. ఆ తర్వాత ఇద్దరూ పక్క సైడ్ కి వెళ్లి ఏకాంతంగా మంతనాలు జరిపారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాల గురించి వీరిరువురు మాట్లాడినట్టు సమాచారం. సినిమా ఇండస్ట్రీ సమస్యలతో పాటు మరిన్ని అంశాల గురించి వీరు ముచ్చటించారు. వీరిద్దరూ ఇంత క్లోజ్ గా కలిసి మాట్లాడుకోవడంతో అక్కడి వారంతా ఫిదా అయిపోయారు. అయితే తన కుమారుడిని గెలిపించడానికి మోహన్ బాబు చాలా తాపత్రయం పడుతున్నారు. ఈ ప్రయత్నంలో ఆయన పవన్ ను కూడా విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.