Maa Election’s: ఇటీవల జరిగిన ‘మా’ అధ్యక్ష ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి గెలిచిన సభ్యులు… మరియు ప్రకాష్ రాజ్.. ఫలితాలు వచ్చిన తర్వాత మీడియా సమావేశం నిర్వహించి సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పోలింగ్ ప్రక్రియ అన్యాయంగా జరిగిందని ఆరోపించారు. మోహన్ బాబు, నరేష్ ఇద్దరు కూడా అమ్మ బూతులు తిట్టారని, దాడులకు కూడా పాల్పడ్డారని.. ఇంత దారుణమైన ఎన్నికలు ఎక్కడ జరిగి ఉండవని.. చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే “మా” అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ప్రక్రియ రోజు సిసి ఫుటేజ్ ఇవ్వాలని ఇటీవల ప్రకాష్ రాజ్ “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ కి.. లెటర్ రాయడం తెలిసిందే.
అయితే ప్రకాష్ రాజ్ రాసిన లెటర్ పై “మా” ఎలక్షన్ అధికారి కృష్ణమోహన్ స్పందించారు. సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని స్పష్టం చేశారు. విషయంలోకి వెళితే సీసీ ఫుటేజ్ నీ పోలీసులు సీజ్ చేశారని… జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ లో సర్వర్ రూమ్ తాళం వేయడం జరిగింది అని.. ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే సీసీ ఫుటేజ్ లో… తమ సభ్యుల పై మోహన్ బాబు దాడులకు పాల్పడిన దృశ్యాలు.. ఉన్నాయని వాటితో ప్రకాష్ రాజ్ కోర్టు కు వెళ్లాలని.. ఆలోచన చేయడం జరిగిందట.
ప్రకాష్ రాజు ప్యానల్ కి ఊహించని షాక్…
సరైన ఆధారాలతో న్యాయస్థానం వద్దకు వెళితే ఖచ్చితంగా “మా” అధ్యక్ష ఎన్నికలలో జరిగిన అవకతవకలు మొత్తం బయటపడతాయని ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు భావించడం జరిగిందట. ఇటువంటి తరుణంలో… “మా” ఎన్నికల అధికారి కృష్ణమోహన్ సీసీ ఫుటేజ్ ఇవ్వలేమని తెలపటంతో ప్రకాష్ రాజు ప్యానల్ కి ఊహించని షాక్ ఇచ్చినట్లు అయింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్.. ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?