మచిలీపట్నం, ఫిబ్రవరి 7: బందరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బందరు పోర్టు పనులకు గురువారం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
మచిలీపట్నంకు ఎంతో ఘన చరిత్ర ఉందనీ, శాతవాహనుల కాలంలోనే ఇక్కడ నుండి సముద్రమార్గంలో ఎగుమతులు, దిగుమతులు జరిగియని చంద్రబాబు అన్నారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో గిన్నిస్ రికార్డు నెలకొల్పిన నవయుగ సంస్థకు ఈ పోర్టు నిర్మాణ బాధ్యత అప్పగించామని చంద్రబాబు అన్నారు. పోర్టు నిర్మాణం వల్ల మచిలీపట్నానికి పూర్వ వైభవం వస్తుందని చంద్రబాబు చెప్పారు. నిర్ణీత సమయంలో పూర్తి చేసే సత్తా ఈ సంస్థకు ఉందని అన్నారు.
నవయుగ విశ్వేశ్వరరావు ఈ జిల్లా వాసేననీ, ఆయన ఈ పోర్టు నిర్మాణానికి ముందుకు రావడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.
‘పోర్టు నిర్మాణం సకాలంలో పూర్తి చేసి ప్రారంభోత్సవానికి నేనే వస్తా’ అని చంద్రబాబు అన్నారు. పోర్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
బందరు పోర్టు ప్రాజెక్టు అంచనా వ్యయం 12వేల కోట్ల రూపాయలు
2025 నాటికి పోర్టు నిర్మాణం పూర్తి చేయాలని ప్రణాళిక.
తొలి దశలో 6,778కోట్ల రూపాయలతో పనులు .