కరోనా వైరస్ భారతదేశంలో రోజురోజుకీ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎంతో మంది రాజకీయ నాయకులు దాని బారిన పడ్డారు. ఎంతో అప్రమత్తంగా ఉంటూ సరైన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు సైతం ఈ మహమ్మారి బారిన పడటం నిజంగా విచారకరం.
ఇక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మాట అటుంచితే ఏకంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా పాజిటివ్ రావడం గమనార్హం దీంతో మధ్య ప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక దేశంలో ఈ వైరస్ బారిన పడిన మొట్టమొదటి సీఎం శివరాజ్ సింగ్ కావడం గమనార్హం.
తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య శివరాజ్ సింగ్ చౌహాన్ నిర్ధారణ పరీక్ష జరగగా అతనికి కూడా కోవిడ్ పాజిటివ్ టాక్ రావడంతో రాష్ట్ర ప్రజలంతా తమ ముఖ్యమంత్రి ఈ వైరస్ బారి నుండి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.