ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మధ్యప్రదేశ్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి రాజా పటేరియాను పోలీసులు అరెస్టు చేశారు. రాజ్యాంగాన్ని కాపాడాలన్నా, మైనార్టీలు క్షేమంగా ఉండాలన్నా ప్రధాని మోడీని చంపేందుకు సిద్దంగా ఉండాలని కాంగ్రెస్ నేత రాజా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పటేరియా వ్యాఖ్యలను బీజేపీతో పాటు కాంగ్రెస్ నాయకులు కూడా ఖండించారు. రాజా పటేరియా చేసిన తీవ్ర వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి సరోత్తమ్ మిశ్ర .. రాజా పటేరియాపై కేసు నమోదు చేయాలని ఆదేశించగా, పోలీసులు సోమవారం ఆయనపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు.

అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగడంతో రాజా పటేరియా వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. ప్రధాని మోడీని ఎన్నికల్లో ఓడించాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. “రాజ్యాంగాన్ని మైనార్టీలు, దళితుల భవిష్యత్తు కాపాడేందుకు మోడీని చంపేందుకు సిద్దం కావాలి, చంపడం అంటే ఆయనను ఓడించడమని అర్ధం” అని పటేరియా అన్నట్లు ఈ వీడియోలో ఉంది. “మోడీ ఎన్నికలు లేకుండా చేస్తారు. మతం, కులం, భాష ప్రాతిపదికన విభజిస్తారు. దళితులు, గిరిజనులు, మైనార్టీల భవిష్యత్తు ప్రమాదంలో పడింది” అని పటేరియా అన్నారు. పన్నా జిల్ల సమయూలో నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హస్తినలో బీఆర్ఎస్ కు ఊహించని షాక్