ఒంగోలు, మార్చి 14 : చాలా రోజులుగా పార్టీని వీడాలా వద్దా అంటూ ఊగిసలాడిన ఒంగోలు మాజీ పార్లమెంట్ సభ్యుడు, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి చివరికి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసిపిలో చేరుతున్నట్లు ప్రకటించారు. అభిమానులు, నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు టిడిపికి రాజీమానా చేసి వైసిపిలో చేరుతున్నానని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ తరపున మూడు పర్యాయాలు ఒంగోలు ఎంపిగా ప్రాతినిధ్యం వహించిన మాగుంట లోక్సభలో ఏకపక్షంగా రాష్ట్ర విభజన బిల్లు ఆమోదించినందుకు నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు.
2014 పార్లమెంట్ ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి చేతిలో మాగుంట ఓడిపోయారు.
అనంతరం స్థానిక సంస్థల కోటాలో టిడిపి ఎమ్మెల్సీగా మాగుంట విజయం సాధించారు.
జిల్లాలో సీనియర్ నాయకుడైన మాగుంట పార్టీ వీడటం టిడిపికి గట్టి దెబ్బేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.