Keerthy Suresh: “మహానటి” సినిమాతో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది కీర్తి సురేష్. సౌత్ ఇండస్ట్రీ లో అనేక మంది స్టార్ హీరోల సరసన నటించిన కీర్తి సురేష్ మహానటి లో సావిత్రి పాత్ర చేసి జాతీయ అవార్డు అందుకొని.. అనేక మంది ప్రశంసలు పొందడం జరిగింది. ఇదిలా ఉంటే త్వరలో చిరంజీవి సినిమాలో చిరంజీవి చెల్లెలి పాత్ర కూడా కీర్తి సురేష్ చేస్తూ ఉంది. కాగా తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన టాప్ మూవీ నీ రీమేక్ చేస్తున్నట్లు ఇందులో కీర్తి సురేష్ ప్రెగ్నెంట్ లేడీ పాత్రలో నటించడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
విషయంలోకి వెళితే బాలీవుడ్ మిమి సినిమా సౌత్ లో త్వరలో రీమేక్ చేయనున్నారట. ఓ విదేశీ జంటకు గర్భం ఇవ్వటం కోసం సరోగసీ విధానం ద్వారా.. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో కృతి సనన్ ఈ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఓ టి టి లో రిలీజ్ అయిన మీమి.. సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే పాత్రను సౌత్లో చేయడానికి కీర్తి సురేష్ రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే గత ఏడాది పెంగ్విన్, మిస్ ఇండియా లాంటి లేడీ ఓరియంటెడ్.. సినిమాలు చేయడం జరిగింది. రెండూ కూడా డీలా పడ్డాయి.
ఇటువంటి తరుణంలో… మరో ప్రయోగాత్మక లేడీ ఓరియంటెడ్ కథకి కీర్తి సురేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సౌత్ ఇండస్ట్రీ లో.. ఈ వార్త వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం కీర్తి సురేష్ స్టార్ హీరోల ప్రాజెక్టులను వరుసగా లైన్ లో పెట్టింది. తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కార్ వారి పాట, తమిళంలో రజనీకాంత్ తో పాటు మలయాళం లో మోహన్ లాల్ సినిమా మరికొన్ని సౌత్ సినిమాలు కీర్తి సురేష్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతున్న తరుణంలో లేడీ ఓరియెంటెడ్ సినిమా కి కీర్తి సురేష్ ఓకే చెప్పినట్లు వార్త ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?