(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
మహారాష్ట్రలోని యవత్మాల్లో సోమవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది దుర్మరణం పాలైయ్యారు. ప్రయాణికులతో వెళుతున్న ఒక పికప్వ్యాన్ వంతెనపై నుంచి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో 18 మంది గాయాల పాలయ్యారు. వ్యానులో కొంత మంది తమ బంధువు అస్తికల నిమజ్జనానికి కోటేశ్వర్ మందిరానికి వెళ్లి జోడ్మోహా తిరిగివస్తుండగా వ్యాను అదుపుతప్పి ఒక చెట్టును ఢీకొని కిందకు పడిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికకక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు చికిత్సపొందుతూ కన్నుమూశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.