ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల రెండవ విడతలో భాగంగా గురువారం దేశ వ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో 95 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం అయ్యింది. అయితే మహరాష్ట్ర, అస్సాంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఆంధ్రప్రదేశ్లో మాదిరిగానే ఇవిఎంలు మొరాయించినట్లు సమాచారం అందుతోంది. నాందేడ్, సోలాపూర్ ప్రాంతాల్లోని చాలా ఇవిఎంలు మొరాయించాయి. ఇవిఎంలు మొరాయించడం వల్ల పోలింగ్ శాతం తగ్గుతోందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ఇవిఎంలు పని చేయకపోవడంతో అస్సాంలో పెద్ద ఏత్తున ఓటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెల 11న ఆంధ్రప్రదేశ్లో జరిగిన పోలింగ్ సందర్భంగా చాలా పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు సాంకేతిక లోపంతో పని చేయకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇవిఎంల మరమ్మత్తుల కారణంగా దాదాపు 450కి పైగా పోలింగ్ కేంద్రంలో రాత్రి వరకూ పోలింగ్ కొనసాగించారు. పలు కేంద్రాల్లో అయితే ఆర్థరాత్రి వరకూ ఓటర్లు బారులు తీరి ఓటు హక్కు వినియోగించుకున్నారు.