అజ్ఙానంలో మగ్గిపోతున్న కొందరు ఏది పడితే అది నమ్మి వాళ్ల విలువైన ప్రాణాలను తీసుకుంటున్నారు. ఊరికే సినిమాలో చూపించే విధంగా గొప్ప శక్తులు వస్తాయని ఎవరు చెప్పినా నమ్మేస్తున్నారు. అలా నమ్ముతూ.. అమాయక జనాన్ని నరబలి పేరుతో చంపేస్తున్నారు. లేకపోతే వాళ్ల ప్రాణాలను తీసుకుంటున్నారు. దీనిపై ఎంతో మంది ఎన్ని చెప్పినా కానీ ఇంకా నమ్మకుండా ఎన్నో దారుణాలకు ఒడి కడుతున్నారు.
మంత్రాల పేరుతో చాలా మంది చేసే దోపిడికి తమ ప్రాణాలను సైతం పోగొట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనే మళ్లీ ఒకటి వెలుగులోకి వచ్చింది. పశువులను మేపడానికి అటవీకి వెళ్లిన ఒక వ్యక్తికి చెట్టుకు వేలాడుతూ మూడు మృతదేహాలు కనిపించాయి. తీరా దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తే.. అది మూఢనమ్మకాల పేరుతో చేసిన దారుణం అని భయట పడింది. పోలీసులు ఇప్పడు దీనికి కారకులైన నిందితుల కోసం వెతుకుతున్నారు.
ఈ ఘటన మహారాష్ట్రలోని షాహాపూర్ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో జరిగింది. రూపేశ్ సపాలే అనే వ్యక్తి తన పశువులను మేపుకుంటూ అడవిలోకి వెళ్తే.. దూరంలో కంపు వాసన రావడం గమనించాడు. దాంతో దగ్గరకు వెళ్లి చూశాడు. అక్కడ ఒక చెట్టుకు మూడు మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. దాంతో వెంటనే అతను గ్రామస్తులకు తెలియజేశాడు. వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తే.. ఎన్నో విచిత్రమైన నిజాలు తెలిశాయి. ఒక బాబా ఇచ్చిన సలహాతోనే ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది. అమావాస్య రాత్రి చెట్టుకు ఉరేసుకుంటే అతీంద్రియ శక్తులు వస్తాయని.. మళ్లీ బ్రతుకుతారని బాబా తెలిపినట్లు తేలింది.
దాంతో నవంబర్ 14న చందా గ్రామానికి దగ్గర్లోని అడవిలోకి ముగ్గురు వెళ్లారు. ఒక చెట్టుకు చీరలతో ఈ ముగ్గురు ఉరేసుకున్నారు. దీనిపై అనుమానిత వ్యక్తి అయిన సచిన్ కంకోచే ను పోలీసులు ప్రశ్నించారు. ఆ రోజు రాత్రి తను కూడా చనిపోయేవాడని కానీ బాబా మాట నమ్మసక్యంగా లేకపోవడంతో అతను పలు కారణాలు చెప్పి వెళ్లిపోయినట్లు సచిన్ తెలిపాడు. ఆ ముగ్గురు మృత దేహాల పక్కన ఉన్న చీర అతనికోసమే అని పోలీసులు గ్రహించారు. దీంతో దీనికి కారణమైన బాబాపై, తప్పించుకు తిరుగుతున్న సచిన్ కంకోచచేపే పోలీసులు కేసు నమొదు చేశారు.