Video Viral: శాస్త్ర సాంకేతిక రంగాల్లో దేశం పరుగెడుతున్నా ఇంకా పలు ప్రాంతాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో మూఢనమ్మకాలు, మంత్రగద్దెలు అన్న అనుమానంతో దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మంత్రగద్దె అనే అనుమానంతో ఓ మహిళను వివిస్త్రను చేసి ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మహారాష్ట్రలోని నందూర్ బాద్ జిల్లాలో ఓ మహిళను మంత్రగత్తె అనే అనుమానంతో స్థానిక ప్రజలు ఆమెను వివస్త్రను చేసి ఊరిగించారు. ఈ ఘటనను కొందరు తమ సెల్ కెమెరాలో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో అప్ లోడ్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన మహారాష్ట్ర ఆంధశ్రద్ద నిర్మూలన్ సమితి (ఎంఏఎన్ఎస్) ఈ ఘటనపై విచారణ జరపాలని నందూర్ బార్ లోని జిల్లా అధికార యంత్రాంగాన్ని అభ్యర్ధించింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మంత్రగత్తెల పేరుతో క్రూరమైన శిక్షలు విధించడం దేశంలోని జార్ఘండ్ రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉంది. దేశంలోని 12 రాష్ట్రాలు జార్ఘండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, ఒడిషా, హర్యానా, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, అస్సాం, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర లలో ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్ సీ ఆర్ బీ) ప్రచురించిన డేటా ప్రకారం 2016 నుండి 2020 మధ్య జార్ఘండ్ లో 94 మహిళలను మంత్రగత్తెలు అన్న అనుమానంతో హత్య చేశారు. ఇది ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ. మధ్యప్రదేశ్ లో 75, చత్తీస్ ఘడ్ లో 60 మంది మహిళల హత్యతో రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి.